దివంగత దిగ్గజ నటి శ్రీదేవి దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషల్లోని సినిమాల్లో నటించి భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. వాస్తవానికి ఇప్పటికీ కూడా టోటల్ భారతీయ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి గారికి ప్రత్యామ్నాయంగా చెప్పుకునే హీరోయిన్ ఒక్కరు కూడా లేరని పలువురు సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక శ్రీదేవి పెద్ద కూతరు జాహ్నవి కపూర్, ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పేరు మరియు క్రేజ్ తో దూసుకుపోతున్నారు. నిజానికి కెరీర్ పరంగా ఆమె కేవలం నటించింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికి, 

ఆ సినిమాలో తన అందం మరియు అభినయంతో ప్రేక్షకుల మది దోచారు జాహ్నవి. ఇక  ప్రస్తుతం 'గుంజన్ సక్సేనా' అలానే, 'రూహి ఆఫ్జా' అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న జాహ్నవికి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఎప్పటికపుడు తన సినిమా మరియు ఫ్యామిలీ విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే అలవాటున్న జాహ్నవి, నిన్న దీపావళి సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్, ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

గోల్డ్ రంగు దుస్తుల్లో, రకరకాల రంగుల డైమండ్స్ వంటి రాళ్లను ధరించి, చూడడానికి అచ్చం దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా ఉన్న జాహ్నవిని చూసిన పలువురు నెటిజన్లు, వహ్వా అంటూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎంతైనా అతిలోక సుందరిగా పేరుగాంచిన శ్రీదేవి గారి కూతురు అంటే ఆ మాత్రం అందం మెయింటెయిన్ చేయాల్సిందే కదా అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. వాటితో పాటు లంగా వోణి ధరించి తన ఫ్యామిలీ లోని బంధువులతో కలిసి సరదాగా దిగిన మరికొన్ని ఫోటోలను కూడా ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు జాహ్నవి.....!!

View this post on Instagram

Shine bright like aaa... Manish Malhotra lehenga ✨

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: