టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా
టాలీవుడ్ పరిశ్రమకు ప్రాణం ఖరీదు
సినిమా ద్వారా పరిచయం కావడం జరిగింది. ఆ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన
మెగాస్టార్, తొలి సినిమాతోనే ప్రేక్షకుల మదిని గెలిచారు. ఇక అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ నేడు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయనకు
మెగాస్టార్ గా గుర్తింపుని తీసుకొచ్చిన
సినిమా ఖైదీ. అప్పటికే 50కి పైగా సినీమాల్లో నటించిన చిరు, ఎన్నో హిట్స్ అందుకున్నప్పటికీ, సూపర్ డూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయనకు ఖైదీ
సినిమా అవకాశం రావడం,
అది అనుకున్న విధంగా సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఆయనను ఏకంగా అప్పటి యువ హీరోల్లో అతి పెద్ద స్టార్ గా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ
సినిమా చిరంజీవి గారికి రావడానికి కొంత
కథ ఉందట. ఇటీవల
టాలీవుడ్ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఆ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఒక
మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టడం జరిగింది. వాస్తవానికి ఖైదీ
సినిమా కథను మొదట
సూపర్ స్టార్ కృష్ణ గారికి వినిపించారట. అప్పటికే దర్శకులు
కోదండరామి రెడ్డి గారితో మంచి అనుబంధం ఉన్న
కృష్ణ గారు, ఈ
కథ యువ నటుడు చిరంజీవికి అయితే ఎంతో బాగుంటుంది, అలానే తప్పకుండా అతనికి ఈ
సినిమా మంచి బ్రేక్ ని ఇస్తుందని చెప్పడం జరిగిందట.
ఆ తరువాత చిత్ర కథకులైన
పరుచూరి బ్రదర్స్ ఆ కథను
చిరంజీవి గారికి చెప్పడం, అది ఆ తర్వాత సినిమాగా తెరకెక్కి, హీరోగా చిరంజీవికి
మెగాస్టార్ అనే గుర్తింపుని తీసుకురావడం జరిగిందట. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే,
చిరంజీవి గారికి ఈ కథ సరిపోతుందని సూచించిన
సూపర్ స్టార్ కృష్ణ గారు, ఈ
సినిమా ఫస్ట్ షాట్ ముహూర్తానికి క్లాప్ కొట్టడం జరిగింది. వాస్తవానికి ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసట. ఇక రిలీజ్ అయి ఇప్పటికే ముప్పై ఏళ్ళు దాటిన ఖైదీ గురించిన ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం బయటకు రావడంతో పలువురు ప్రేక్షకులు దీనిపై మరింత ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.....!!