ప్రస్తుతం
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అది యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ అని అందరు ముక్త కంఠంతో చెప్పేస్తారు.
బాహుబలి ముందు నుండి
ప్రభాస్ పెళ్లి మీద రకరకాల రూమర్స్ వచ్చాయి.. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా
ప్రభాస్ తో తాను పెళ్లికి రెడీ అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది స్టార్ హీరోయిన్
కాజల్ అగర్వాల్.
అయితే ఇది రియల్ గా కాదు ఓ చాట్ షోలో పాల్గొన్న
కాజల్ అందులో ఓ ప్రశ్నకు సమాధానంగా
ప్రభాస్ తో పెళ్లికి రెడీ అనేసింది. ఇంతకీ ఏంటా టాక్ షో అంటే మంచు
లక్ష్మి నిర్వహిస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్.
బాలీవుడ్ నుండి మన భాషకు వచ్చిన ఈ క్రేజీ షో స్టార్స్ బెడ్ రూం సీక్రెట్స్ ను బయట పెట్టేస్తుంది.
ఇందులో భాగంగా
కాజల్ ఛాన్స్ వస్తే రాం
చరణ్, ఎన్.టి.ఆర్,
ప్రభాస్ లలో ఎవరిని పెళ్లాడుతావ్.. ఎవరితో డేట్ కు వెళ్తావ్.. ఎవరిని చంపేస్తావ్ అని అడిగింది మంచు లక్ష్మి. దానికి సమాధానంగా
చరణ్ ను చంపేస్తా.. ఎన్.టి.ఆర్ తో డేట్ కు వెళ్తా..
ప్రభాస్ ను
పెళ్లి చేసుకుంటా అనేసింది కాజల్. అయితే మిగతా ఇద్దరికి
పెళ్లి అయిన కారణం చేత మాత్రం
ప్రభాస్ ను పెళాడుతా అన్నది.
ఇక
రానా తనకు నచ్చిన కో స్టార్ అని.. తనతో పనిచేయడం ఎంత ఈజీగా ఉంటుందో అంత హార్డ్ అనిపిస్తుంది. షూటింగ్ టైంలో తను చాలా కేరింగా ఉంటాడని చెప్పింది కాజల్. ఈ చిట్ చాట్ లో భాగంగా
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో రొమాన్స్ కు తాను ఇబ్బంది పడ్డానన్న విషయాన్ని కూడా చెప్పి షాక్ ఇచ్చింది కాజల్. మొత్తానికి
కాజల్ దాదాపు అన్ని విషయాల్లో బాగానే ఓపెన్ అయ్యిందని చెప్పొచ్చు.