2020 సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్టుగా ఒకేరోజు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు మహేష్, అల్లు అర్జున్. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్.. నా పేరు సూర్య తర్వాత ఎలాగైనా ఓ సూపర్ హిట్ కొట్టేయాలన్న కసితో మీద బన్ని ఇలా ఇద్దరు తమ సినిమాలతో టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు.
అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ప్రమోషనల్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒకరకంగా సంక్రాంతి సినిమాల సందడి మొదలు పెట్టినట్టే ఉంది. బన్ని సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తుంటే సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. లేటెస్ట్ గా దీవాళి కానుకగా సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ అనీల్ రావిపుడి ఓ వీడియో షేర్ చేశాడు.
సినిమాలో నటిస్తున్న సుబ్బరాజు, వెన్నెల కిశోర్ ఇద్దరు సినిమా కథను చెబుతుంటారు.. అలా చెప్పే టైంలో డైరక్టర్ అనీల్ రావిపుడి వచ్చి మన సినిమా వచ్చేది పెద్ద పండుగకు ఇప్పటి నుండే ప్రమోషన్స్ ఎందుకు అంటాడు. అయితే ఈ డైలాగ్ బన్ని సినిమా గురించి అని అంటున్నారు. అల్లు అర్జున్ సినిమా చేస్తున్న హంగామా మీదనే అనీల్ తన మార్క్ పంచ్ వేశాడని తెలుస్తుంది.
అయితే అనీల్ రావిపుడి చేయాల్సిన టైంలో సందడి చేయాలి ఇప్పటి నుండే ఎందుకు అన్నట్టుగా తన వీడియోతో మెసేజ్ ఇచ్చాడు. మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: