తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 3 మరో వారం రోజుల్లో అయిపోతుంది.  మొన్న ఆదివారం తీన్మార్ సావిత్రి (శివజ్యోతి) ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో  ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.  వరుణ్ సందేశ్, శ్రీముఖి,రాహుల్, బాబా భాస్కర్, అలి రెజా.  ఇప్పటి వరకు ఇచ్చిన టాస్క్ లు ఒకలెక్క ఇక ముందు మరోలెక్క అన్న చందంగా ఇంట్లో గేమ్స్, టాస్కులు నడుస్తున్నాయి.  ప్రస్తుతం ఆడవాళ్లలో ఒక్క శ్రీముఖి మాత్రమే మిగిలి ఉంది.  ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఎంట్రీ ఇచ్చారు. 

ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ప్రత్యేక అతిథి.  సుమ ఎంట్రీతో అవాక్కయిన హౌస్ మేట్స్ వెల్కం చెబుతూ ఆమెతో కలిసి అల్లరి చేశారు. ముందుగా హౌస్ మొత్తం ఓ రౌండ్ కొట్టేసింది సుమ.   హౌస్ మేట్స్ తమ బెడ్ దగ్గర పెట్టుకున్న స్టఫ్ ని చెక్ చేసింది. రాహూల్ మధుర జ్ఞాపకాలను గుర్తుకు చేసింది.  శ్రీముఖి మేకప్ కిట్ పై ఓ లుక్కేసి ఆడియన్స్ కి చూపించింది. తర్వాత బాబా భాస్కర్ ని పిలిచి చిన్నప్పుడు దీపావళి ఎలా చేసుకున్నారని అడిగింది. తర్వాత  సుమ కోసం మటన్ బిరియాని చేసి పెట్టాలని దానికి సంబంధించిన సామాగ్రిని పంపించారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ లో రాహుల్, వరుణ్ లు పాటలు పాడారు.

వంట పూర్తయిన తరువాత హౌస్ మేట్స్ తో ఫన్నీ టాస్క్ ఆడించింది సుమ. చెవులకు హెడ్ ఫోన్ తగిలించి మ్యూజిక్ ప్లే చేస్తూ కొన్ని మాటలు చెబుతుంది..అవి కరెక్ట్ గా అంటే వారు మంచి ఎంట్రటైనర్ అని చెప్పింది.  శ్రీముఖి ఎంతో నేర్పుగా సుమ పలికే పదాలు మొత్తం కరెక్ట్ గా చెప్పింది.  ఇక వరున్ సందేశ్ కి ఓ రేంజ్ లో నవ్వించాడు.  తర్వాత బాభా భాస్కర్, రాహుల్, అలీ రెజా ఇలా అందరూ సుమ చెప్పేది అర్థం కాక అన్నీ తప్పులు చెబుతూ ఎంట్రటైన్ చేశారు. తర్వాత ఈ టాస్క్ లో వరుణ్ ని విజేతగా ప్రకటించింది సుమ.  ఆ తరువాత బిరియాని తిని బాగుందని బాబా భాస్కర్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంట్లో తను నిద్రపోతే కుక్కలు మొరుగుతాయో లేదో టెస్ట్ చేసి అందరినీ నవ్వించింది సుమ. 


మరింత సమాచారం తెలుసుకోండి: