టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, హరితేజ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న పిక్స్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి స్పందన సంపాదించాయి. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడియో ఫంక్షన్స్ కు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు చెప్తున్నారు. గతంలో మహేష్ బాబు నటించిన టక్కరిదొంగ సినిమా ముహూర్తానికి, అలానే నిజం సినిమా వందరోజుల వేడుకకు మెగాస్టార్ ప్రత్యేక అతిథిగా విచ్చేయడం జరిగింది. ఇక ఇటీవల మెగాస్టార్ మరియు మహేష్ బాబు, ఒక ఫంక్షన్ లో కలుసుకుని ఎంతో సరదాగా ముచ్చటించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

అయితే అదే సమయంలో తన సినిమా ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేకంగా మీరు రావాలని మహేష్, మెగాస్టార్ ని ఆహ్వానించారని, దానికి మెగాస్టార్ కూడా తప్పకుండా వస్తాను అని మాటిచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఎక్కడా కూడా న్యూస్ బయటకు రానప్పటికీ, నేడు ఈ వార్త లీక్ అయిందని, అలానే దీనిపై మరికొద్దిరోజుల్లో సరిలేరు టీమ్ నుండి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే మాత్రం, అటు మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది సూపర్ హిట్ వార్త అనే చెప్పాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: