తెలుగులో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరు పూజా హెగ్దె పేరు చెబుతారు. వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటూ సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్న పూజా హెగ్దె తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించింది. అయితే టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా బాలీవుడ్ లో మాత్రం సైడ్ క్యారక్టర్స్ చేస్తుంది.  


తెలుగులో ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటే పూజా హెగ్దె మాత్రం హింది సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ మొహెంజోదారో మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కాస్త తుస్సుమన్నది. అయినా ఆశ చావక అవకాశాల కోసం ప్రయత్నించిన పూజాకు హౌస్ ఫుల్ 4 లో ఛాన్స్ దక్కింది. 


ఈ సినిమాలో పూజాది చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర. అంత చిన్న పాత్ర ఇచ్చినా అందాలతో అదరగొట్టింది అమ్మడు. అయితే తెలుగిలో సోలో హీరోయిన్ గా సత్తా చాటుతున్న పూజా హెగ్దె ఇలా బాలీవుడ్ లో సైడ్ రోల్స్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇలా తప్పులు చేయడం వల్ల తన కెరియర్ రిస్క్ లో పడే అవకాశం ఉందని అంటున్నారు.  


తెలుగులో పూజా హెగ్దె ఫాం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న పూజా హెగ్దె ప్రభాస్ రాధాకృష్ణ కాంబో మూవీలో కూడా నటిస్తుంది. అయితే ఇంత ఆశపడి చేసిన హౌస్ ఫుల్ 4 ఫ్లాప్ అయ్యింది. మరి ఇకనైనా పూజా పూర్తిగా తెలుగు సినిమాలు చేస్తూ ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు. మరి ఇప్పటికైనా అమ్మడు మారితే బెటర్ లేదంటే ఇలానే మరో రెండు ఫ్లాపులు పడితే ఆమెని పట్టించుకునే వారు ఉండరు.


మరింత సమాచారం తెలుసుకోండి: