టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతుంటాయి . ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో  ఏదో మ్యాజిక్ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా రాజమౌళి ఇప్పటివరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలిచాయి కూడా . రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. దీంతో రాజమౌళి క్రేజ్  కూడా ప్రపంచ వ్యాప్తంగా పాకి పోయింది. అయితే బాహుబలి లాంటి  సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి తర్వాతి సినిమాపైనే  అందరి కళ్ళు ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాని  తెరకెక్కిస్తుండటంతో  అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. 

 

 

 

 ఈ సినిమా స్టోరీ పై కూడా అందరూ ఆసక్తిగా ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు  చారిత్రక యోధులైన  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కథ నేపథ్యంతో  రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో  రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి గాయాలు కావడంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడినట్లయింది . ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికె  చాలా వరకు  షూటింగ్  పూర్తయింది. కాగా  సినిమాలో  తీసిన కొన్ని షాట్లు సరిగ్గా రాలేదని రాజమౌళి భావిస్తున్నారట. 

 

 

 

 ఇప్పటికే షూటింగ్ జరిపిన కొన్ని సన్నివేశాలు చూసిన రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారట... మేకింగ్  షాట్స్  సరిగాలేదని దాంతో ఆ సీన్స్ ని రీషూట్ చేయాలని భావిస్తున్నారట రాజమౌళి. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు నిర్మాతలతో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే రాజమౌళి ఏం చేసినా చాలా పక్కాగా చేస్తుంటారు.  అందుకే ఆయన సినిమాల్లో  పర్ఫెక్షన్ బాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన కొన్ని షాట్స్ నచ్చలేదని రీషూట్ చేయాలని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వచ్చిన వార్తలన్నీ నిజమ కదా  తెలియాలంటే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: