అక్కినేని వారసుడు
సుమంత్ ఈ మధ్య మళ్ళీ వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు అతని కెరీర్లో "సత్యం"
సినిమా తప్ప వేరే హిట్లు ఏమీ కనబడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రావా చిత్రంతో మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టు అనిపిస్తుంది. ఈ
సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు
సుమంత్ కి మంచి హిట్ ని ఇచ్చింది. అప్పటి వరకు
సుమంత్ చేసిన సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు.
మళ్ళీ రావా, సుబ్రమణ్యపురం వంటి చిత్రాలు చేశాక తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ఈ
సినిమా ఒప్పుకోవడానికి
సుమంత్ చాలా టైమ్ తీసుకున్నాడు. సోలో హీరోగా చేయడానికి ఆయన చాలా రకాల కథలు విన్నాడట. అన్నీ విన్న తర్వాత ఒక స్క్రిప్ట్ అతనికి బాగా నచ్చిందట. అయితే ఆ స్క్రిప్ట్ మళయాలీ
సినిమా కథ కావడం విశేషం.
సుమంత్ ప్రస్తుతం
రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.
2018 సంవత్సరంలో కేరళలో విడుదలై అక్కడ మంచి హిట్ అందుకున్న మలయాళ చిత్రం ‘పడయోత్తం’ సినిమాని
సుమంత్ తెలుగులో
రీమేక్ చేయనున్నాడట. అయితే ఈ చిత్రం గ్యాంగ్ స్టర్
సినిమా కావడంతో
సుమంత్ కి సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. అదీ గాక అది పూర్తి
కామెడీ సినిమా...సుమంత్ సినిమాలన్నీ సీరియస్ గానే ఉంటాయి. ఒక సత్యం మినహాయిస్తే
కామెడీ అంశం ఆయన సినిమాలో వర్కవుట్ అయినట్లు లేదు.
ఈ సినిమాలో
సుమంత్ సరసన ఐమా అనే కొత్త
హీరోయిన్ నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. తమ్మినేని జనార్థన్ రావు మరియు శర్మ చుక్కా సంయుక్తంగా ఈస్ట్
ఇండియా టాకీస్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.