దర్శకేంద్రుడు  రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన 'ఝుమ్మందినాదం' సినిమాతో తెలుగులోకి పరిచయమైన తాప్సీ, తొలి సినిమాలోనే తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఆమె ప్రభాస్ సరసన "మిస్టర్ పర్ఫెక్ట్" లో నటించింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత ఆమెకు  టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.


 ఆ తర్వాత ఆమె కోలీవుడ్  వైపు కూడా కొన్ని రోజులు చూసింది కానీ అక్కడ కూడా విజయం అంత పెద్దగా రాలేదు అనే చెప్పాలి. మధ్యలో తెలుగులో నటించిన ఆనందోబ్రహ్మ మంచి విజయం విజయం సాధించింది . ఆ తర్వాత ఆమె దృష్టి మొత్తం హిందీ పరిశ్రమ వైపు మళ్ళింది ఆమె నటించిన పింక్, బదలా ,ముల్క్ లాంటి సినిమాలు బాగా హిట్ అయ్యాయి దీంతో ఆమె అక్కడ చాలా బిజీ అయ్యారు.

ముఖ్యంగా పింకు లో ఆమె చేసిన పాత్ర అందరినీ విశేషంగా ఆకట్టుకుంది దానితో ఆమె అక్కడ బాగా పాపులర్ అయ్యారు . అలాగే మొన్న వచ్చిన "గేమ్ ఓవర్" సినిమా కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.అందులో ఒక మానసిక రోగి లాగా ఆమె నటన అద్భుతం అని చెప్తారు .


 మధ్య మధ్యలో ఘాటైన ఫోటో షూట్ చేస్తూ కుర్రకారుని సంతోష పెడుతూ ఉంది. తాజాగా ఆమె నటించిన "సాన్డకిఆంఖ్" సినిమా  విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.  తొలిరోజు కలెక్షన్లు పెద్దగా రాకపోయినా సినిమా మీద ఉన్న మంచి రెస్పాన్స్ తో కలెక్షన్స్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి.సోషల్ మీడియాలో కూడా ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్లో కలిసిరాని ఏ ముద్దు గుమ్మ కి బాలీవుడ్ మాత్రం పటం కట్టింది అనే చెప్పాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: