మీటూ ఇష్యూ మీద షాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ గాయని
సోనా మొహాపాత్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు
అను మాలిక్ తనను లైంగికంగా వేధించాడని గత సంవత్సరం సోనా షాకింగ్ ఆరోపణలు చేశారు. సోనాతో పాటు గాయని శ్వేతా పండిట్ కూడా
అను మాలిక్ ఎలాంటి వాడో..అతని నిజ స్వరూపం ఏంటో బయటపెట్టారు. ఈ ఇష్యూ కాస్త సీరియస్ అవడంతో ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్ను తొలగించారు. ఈ షోకు అను మాలిక్ జడ్జ్గా వ్యవహరించాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ సోనాకు న్యాయం జరగపోగా...అను మాలిక్ను తొలగించిన తర్వాత సోనాను కూడా తీసేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అను మాలిక్పై మీటూ ఆరోపణలు ఉన్నప్పటికీ అతన్ని మళ్లీ ఇండియల్ ఐడల్ సీజన్ 11 జడ్జ్గా నియమించారు. దాంతో సోనా రెచ్చిపోయి ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
అను మాలిక్ నన్ను లైంగికంగా వేధించాడు అని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. ఇండియాలో మరో నిర్భయ సంఘటన జరిగితే తప్ప ఎవ్వరూ కళ్ళు తెరవరా? అనుపై నేను ఆరోపణలు చేయడంతో నన్ను షో నుంచి తీసేశారు. నేను అనుపై ఆరోపణలు చేయడంతో మరో
టీవీ ఛానెల్ రేటింగ్స్ బాగా పెరిగిపోయానని చెప్పారు. ఏడాది తర్వాత ఆ కామాంధుడిని మళ్లీ జడ్జ్ గా కూర్చోబెట్టారు. నేను ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా ప్రూఫ్ ఉందా అని చాలా మంది అడిగారు. రేప్ చేస్తున్నప్పుడు, లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రూఫ్లు కలెక్ట్ చేస్తూ ఉండాలని ఈ వెధవల అభిప్రాయం.. అంటూ కట్టలు తెంచుకున్న ఆవేశంతో తన గోడును వెల్లబోసింది.
అను మాలిక్ గురించి తెలిసి కూడా మిగతా ఇద్దరు సింగర్స్ ఆయనతో కలిసి ఎలా పనిచేస్తున్నారో నాకు అర్థంకావడంలేదు. ఎంతైనా అందరికీ డబ్బే ముఖ్యం. అను మాలిక్కు మళ్లీ జడ్జ్ సీట్ ఎందుకు కట్టబెట్టారని నేను సింగర్
విశాల్ దద్లానీని అడిగాను. చాలా చర్చలు జరిగాయని
విశాల్ నాకు చెప్పాడు. పైగా ఇలా మాట్లాడినందుకు తన పేరు బయటపెట్టొద్దని చెప్పాడు. నేను ఏం బయటపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క లాజిక్ కూడా లేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోనా. మరి దీని మీద
అను మాలిక్ ఇంకా స్పందించలేదు..!