టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తన కెరీర్ లో ఎన్నడూ లేనంత స్పీడ్ గా ప్రస్తుతం సినిమాలు వరుసగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటికే
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న
సూపర్ స్టార్, ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరుతో మరొక సూపర్ హిట్ కొట్టి, తన కెరీర్లో మొదటి సారి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని ఎంతో కసిగా ఆ
సినిమా చేస్తున్నారు.
మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ
సినిమా ద్వారా లేడీ
సూపర్ స్టార్ విజయశాంతి గారు
భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు.
రష్మిక మందన్న
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడం జరుగుతోంది. ఇకపోతే
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక అరుదైన సూపర్ రికార్డు ని తన సొంతం చేసుకున్నారు తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పటివరకు
ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ పొందిన పోస్టర్లలో మహేష్ బాబు నటించిన మూడు
సినిమా పోస్టర్లు ఉండడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఇప్పటివరకు
టాలీవుడ్ సినిమా పోస్టర్స్ లో అత్యధిక లైక్స్ పొందిన పోస్టర్ గా ఇటీవల సరిలేరు నీకెవ్వరు నుండి
దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ 68,600 లైక్స్ పొందగా,
దాని తరువాత రెండవ స్థానంలో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలోని పోస్టర్ కు 68,300 లైక్స్, అలానే మూడవ స్థానంలో
మహర్షి సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ 67,700 లైక్స్ తో, ఇక నాలుగవ స్థానంలో సరిలేరు నీకెవ్వరు నుండి
దసరా సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ 64,700 లైక్స్ దక్కించుకోవడం జరిగింది. సో ఈ విధంగా సోషల్
మీడియా మాధ్యమం
ట్విట్టర్ లో నిజంగా తనకు సరిలేరు మరెవ్వరు అనేలా
మహేష్ బాబు రుజువు చేసుకున్నారు. మరి
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ
సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి....!!