టాలీవుడ్ దర్శకధీరుడు
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్ర రాజాలైన
బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఎంతటి అత్యద్భుత విజయాలు దక్కించుకున్నాయో మనకు అందరికీ తెలిసిందే.
ప్రభాస్ హీరోగా
అనుష్క శెట్టి,
తమన్నా హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలో
దగ్గుబాటి రానా విలన్ గా నటించగా
సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిచడం జరిగింది. ఆర్కా
మీడియా బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ
సినిమా రెండు సినిమాలు ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పాయి. ఇక రెండవ భాగం అయితే, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1900 కోట్ల మార్క్ వరకు చేరుకుంది. ఇక ఈ
సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా,
కేవలం
అమీర్ ఖాన్ నటించిన దంగల్
సినిమా తప్పించి మరొక
సినిమా బాహుబలి 2 రికార్డు ని కొట్టలేకపోయింది. ఇక ఇప్పటికే
బాహుబలి సినిమాల రికార్డులను బద్దలు కొట్టాలని కొన్ని భారీ సినిమాలు పక్కాగా సిద్ధం అవుతున్నాయి. వాటిలో ఒకటి, ప్రముఖ
తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోయే పొన్నియన్ సెల్వం సినిమా. ఎంతో భారీ ఎత్తున చారిత్రాత్మక నేపథ్యంలో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినపడుతోంది. ఇక దీనితో పాటు మరొక
తమిళ దర్శకుడు
సుందర్ సి, సంఘమిత్ర పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఫ్యాన్టసి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఎందరో
తమిళ అగ్ర నటులు నటించబోతున్న ఈ
సినిమా అతి త్వరలో ప్రారంభం కానుంది.
ఇకపోతే ఈ రెండిటికంటే మరింత భారీగా ఊహకందని విధంగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో దంగల్ దర్శకుడు, తెలుగు
నిర్మాత అల్లు అరవింద్ మరియు మరొక ఇద్దరు
బాలీవుడ్ బడా నిర్మాతలు కలిసి త్వరలో రామాయణం సినిమాను మూడు భాగాలుగా నిర్మించనున్నారు. భారత దేశంలోని పలు భాషలకు చెందిన నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విధంగా ఏకంగా మూడు భారీ సినిమాలు
బాహుబలి రికార్డ్స్ ని లేపేయాలని గట్టిగా కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు సినిమాలు ఎంతమేర విజయాలు అందుకుని,
బాహుబలి కలెక్షన్స్ ని దాటేస్తాయో తెలియాలంటే, మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే...!!