కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న కోసం తెలుగు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఛలో, గీతా గోవిందం, దేవదాస్, డియర్ కమ్రేడ్ చేసిన నాలుగు సినిమాలతోనే అమ్మడు స్టార్ రేంజ్ అందుకుంది. అనుష్క, కాజల్, తమన్న, సమంత ఇలా అందరు కెరియర్ లో దాదాపుగా వెనకుపడగా రష్మిక, పూజా హెగ్దె లాంటి వారికి ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. 


ముఖ్యంగా రష్మికకు మాత్రం వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న రష్మిక మందన్నసినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మూవీకి సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమెకు బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. 


ఈమధ్యనే తన రెమ్యునరేషన్ గురించి డిమాండ్ ను బట్టి నిర్మాతలకు హీరోయిన్స్ కు ఎంత ఇవ్వాలన్నది తెలుసని.. మేము అడిగినంత మాత్రాన ఇవ్వరని చెప్పుకొచ్చింది. అనుకునట్టుగానే రష్మికకు మైత్రి వారు అదిరిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అయితే అది ఎంతన్నది మాత్రం తెలియలేదు. రష్మిక కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. 


ఇక ఈ సినిమా ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో వస్తుందట. సుకుమార్ రాం చరణ్ రంగస్థలం సినిమాలానే బన్నిని ఈ సినిమాలో నాటుగా చూపిస్తాడని తెలుస్తుంది. సినిమా మొత్తం అల్లు అర్జున్ లుంగి, బనియన్ మీద కనిపిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న బన్ని ఆ మూవీతో హిట్ కొట్టడం పక్కా అనిపిస్తుంది. రిలీజైన సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను ఎంతగానో అలరిస్తున్నాయి. సినిమా మ్యూజిక్ పరంగా హిట్ అనిపించుకుంది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: