ప్రస్తుతం
రాజ్ తరుణ్ కెరియర్ ఏమాత్రం బాగుండలేదు. ఇక అతడికి మిగిలి ఉన్న ఆశలు అన్నీ దిల్
రాజ్ బ్యానర్ పై నిర్మింపబడ్డ ‘ఇద్దరి లోకం ఒకటే’
మూవీ పై ఉన్నాయి. ఈ
మూవీ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయినా ఈ మూవీకి సంబంధించి సరైన రిలీజ్ డేట్ కోసం అన్వేషణ సాగిస్తున్నాడు.
వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే విడుదల చేయవలసి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే అనూహ్యంగా
డిసెంబర్ 20న జరగబోతున్న
బాలకృష్ణ సాయి తేజ్ ల
మూవీ మధ్య
రాజ్ తరుణ్ సినిమాను ఇరికించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.
దిల్
రాజ్ నిర్మించిన ’96’
రీమేక్ ను ఈ
డిసెంబర్ వార్ లోకి దింపుతారు అని భావించారు. అయితే ఈ సినిమాను వెనక్కు జరిపి ఇప్పుడు
రాజ్ తరుణ్ ను
బాలయ్య సాయి తేజ్ ల మధ్య ఇరికించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ
ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.
రాజ్ తరుణ్ లేటెస్ట్
మూవీ పై ప్రస్తుతం ఏమాత్రం అంచనాలు లేవు. దీనితో ఒక లాటరీలా దిల్
రాజ్ ఇలాంటి సాహసం చేస్తున్నాడా లేదంటే దిల్
రాజ్ కు వ్యక్తిగతంగా ఈ
మూవీ పై అంచనాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రాజ్
తరుణ్ క్రేజ్ తో పోల్చుకుంటే బాలకృష్ణకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
మారుతి బ్రాండ్ ను నమ్ముకుని వస్తున్న సాయి తేజ్
మూవీ పై కూడ కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి. దీనితో అంచనాలు లేని
రాజ్ తరుణ్ సినిమా క్రిస్మస్ వార్ లో చిక్కుకోవడం సంచలనంగా మారింది. ఈ
మూవీ కూడ
రాజ్ తరుణ్ కు విజయాన్ని అందించలేకపోతే ఇక ఈ
హీరో కెరియర్ మరింత అయోమయ స్థితిలో పడిపోతుంది..