కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన
సినిమా ఖైదీ. కార్తీ ఒక లారీ
డ్రైవర్ గా తొలిసారి ఒక పక్కా
మాస్ పాత్రలో నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా డ్రీం
వారియర్ పిక్చర్స్ వారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాను
సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ కొనుగోలు చేసి తెలుగులో రిలీజ్ చేసారు. రిలీజ్ రోజు తొలి షో నుండి అద్బుతమైన టాక్ ని సంపాదించిన ఈ
సినిమా ప్రస్తుతం అటు తమిళనాడుతో పాటు, ఇటు ఆంధ్ర మరియు
తెలంగాణ వంటి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. పూర్తిగా నైట్ టైంలో సాగే ఈ సినిమాలో పాటలు మరియు
హీరోయిన్ వంటి అంశాలు లేకపోయినప్పటికీ,
దర్శకుడు లోకేష్ సినిమాను ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించడం జరిగింది. నిజానికి ఈ యాక్షన్ మూవీలో కథే ప్రధాన
హీరో అని, ఇక మిగతా పాత్రలన్నీ కూడా
సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డాయని అంటున్నారు. ఇక కార్తీ అయితే తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు అనే చెప్పాలి. ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసలు సైతం దక్కించుకుని ప్రస్తుతం ముందుకు సాగుతున్న ఈ
సినిమా, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దుమ్మురేపే కలెక్షన్స్ తో ముందుకు సాగుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక వారు చెప్తున్న లెక్కలను బట్టి, ఈ
సినిమా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ అయిన చాలా ప్రాంతాల్లో లాభాల్లోకి చేరి, బయ్యర్ల అంచనాలు తలక్రిందులు చేయనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ
సినిమా రిలీజ్ రోజునే
విజయ్ బిగిల్ కూడా రిలీజ్ కావడంతో,
ఖైదీ సరిగ్గా ఆడే పరిస్థితి ఉండదని ఎక్కువమంది బయ్యర్లు భావించారని, అయితే ప్రస్తుతం
బిగిల్ ని మించిన టాక్ తో ప్రస్తుతం
ఖైదీ ముందుకు సాగుతుండడం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందట. ఇటీవల వరుసగా తన సినిమాల పరాజయాలతో ఎంతో నిరాశకు గురైన కార్తీ, ఒక్కసారిగా ఇంత పెద్ద
సక్సెస్ రావడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ
సినిమా సక్సెస్ మీట్ నేడు తమిళనాడులో ఎంతో వైభవంగా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ
ఖైదీ ఇంకెంతమేర కొల్లగొడతాడో చూడాలి ...!!