టాలీవుడ్ యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు
రాజమౌళి ఇటీవల తెరకెక్కించిన
బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు కూడా మన దేశంతో పాటు విదేశాల్లో కూడా అతి పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల తరువాత
ప్రభాస్ ఒక్కసారిగా భారతీయ సూపర్ స్టార్స్ లో ఒకరిగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక అదే ఊపుతో యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో
ప్రభాస్ నటించిన
సాహో సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా
సక్సెస్ కాలేదు. దాదాపుగా రూ.350 కోట్ల భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, సెట్టింగ్స్,
గ్రాఫిక్స్ వంటివి బాగున్నప్పటికీ, సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా కథ మరియు కథనాలు లేకపోవడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమాపై పెదవి విరిచారు.
ఇక దాని తరువాత ప్రస్తుతం
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్
సినిమా జాన్. ఇంకా అఫీషియల్ గా టైటిల్ నిర్ణయం కానప్పటికీ, ప్రస్తుతం ఈ టైటిల్ మాత్రం ప్రచారం అవుతోంది.
జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి
ప్రభాస్ సరసన గోల్డెన్ లెగ్
భామ పూజ హెగ్డే
హీరోయిన్ గా నటిస్తోంది. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ
సినిమా ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక నేడు కొన్ని ఫిలిం
నగర్ వర్గాల నుండి అందుతున్న వార్తలను బట్టి, ఈ
సినిమా విషయమై
ప్రభాస్ తీసుకుంటున్న నిర్ణయాలతో
సినిమా యూనిట్ ఎంతో బెంబేలెత్తిపోతున్నట్లు టాక్ వినపడుతోంది.
సాహో విషయమై నేర్చుకున్న గుణపాఠంతో
ప్రభాస్ ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో అలోచించి మరీ తెరకెక్కించేలా దర్శకుడికి సూచనలు చేస్తున్నారట. అలానే కథ మరియు కథనాల విషయమై కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా కొద్దిపాటి మార్పులు కూడా చేయించినట్లు చెప్తున్నారు. అలానే అన్ని విధాలుగా ఈ
సినిమా తన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అలరించాలని
ప్రభాస్ ఎంతో పట్టుదలతో నటిస్తున్నారట. మరి నేడు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సాహోతో ఢీలా పడ్డ ఆయన ఫ్యాన్స్ కు
జాన్ మంచి హిట్ ని అందించడం ఖయమని అనిపిస్తోంది.....!!