తెలుగు లో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఫ్యామిలీ నుంచి మొదటిసారి హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు విక్టరీ వెంకటేశ్.  ‘కలియుగ పాండవులు’ సినిమాతో  హీరోగా వెండితెరకు పరిచయం అయిన వెంకటేశ్ మొదట్లో యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా నటించారు.  తర్వాత ట్రెండ్ మార్చి ఫ్యామిలీ, కామెడీ తరహా సినిమాల్లో నటించి ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2 ’ తో సూపర్ హిట్ అందుకున్నారు.  ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి ‘వెంకిమామ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ త్వరలో రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా తరువాత వెంకటేశ్ 'అసురన్' రీమేక్ లో చేయనున్నాడు. తమిళంలో ధనుశ్ చేసిన ఈ సినిమా దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుందని సురేశ్ బాబు చెప్పారు. 

అయితే వెంకటేష్ 75వ సినిమా ఎవరితో తీయబోతున్నారు అన్న సందేహాలు వెంకి ఫ్యాన్స్ కి మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పాడు. కానీ వెంకటేశ్ 75వ సినిమా దర్శకుడిగా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. మొదటి నుంచి వెంకటేశ్ తన 75వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా అభిమానులకు గుర్తుండి పోయేలా ఉండేటా ప్లాన్ చేస్తున్నారట. గతంలో ‘మల్లీశ్వరి’ లాంటి సూపర్ హిట్ అందించిన త్రివిక్రమ్ తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: