గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. మరో వైపు వంశీ ఇటు టీడీపీకి, బీజేపీకి కూడా చెడ్డ కాకుండా వ్యూహరచన చేస్తున్నారు. మరి వంశీ రాజకీయ తుపాన్ ఏ తీరం చేరుతుందో అన్న సస్పెన్స్ ఓ వైపు ఉంటే వంశీ కచ్చితంగా వైసీపీ గూటికి చేరుతారని అంటున్న వర్గమూ ఉంది. ఈ నేపధ్యంలో వంశీ వద్దు అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్.


జగన్ అంటే ప్రాణం ఇచ్చే వారు సైతం వంశీని పార్టీలోకి తీసుకోవద్దు, ఆయన నమ్మదగ్గవారు కాదు అని జగన్ కి సూచిస్తున్నారుట. వంశీని తీసుకోవద్దు అంటూ వైసీపీ ఫ్యాన్స్ వాట్సప్  మేసేజులతో యుధ్ధమే చేస్తున్నారు. నిజానికి వంశీ ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు, కానీ ఆయన వైసీపీలో నవంబర్ 3వ తేదీన చేరుతారని  మరోవైపు అంటున్నారు. దాంతో ఈ ప్రచారానికి విరుగుడుగా వైసీపీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాను ఆశ్రయించారు.


వంశీ పరిటాల అనుచరుడని, పెనుగొండలో  ఒకప్పటి ఎమ్మెల్యే ఎస్వీ రమణారెడ్డి హత్యకేసులో ఆయన పాత్ర ఉందని కూడా సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ వైరల్ అవుతోంది.ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు అంటున్నారు. వంశీని కనుక తీసుకుంటే వైసీపీ పుట్టె మునగడం ఖాయమని కూడా అంటున్నారు. వంశీ వంటి వారు ఎపుడెలా ఉంటారో చెప్పలేమని అంటున్నారు.


గన్నవరం ఆయన విశ్వనీయతను ద్రుష్టిలో ఉంచుకుని జగన్ జాగ్రత్తగా ఉండాలని వైసీపీలోకి అసలు ప్రవేశం లేకుండా చూడాలని సూచిస్తున్నారు. అయినా ఇపుడు వైసీపీకి అంత అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వంశీని తీసుకోవద్దు అంటున్న వారే వైసీపీలో మెజారిటీ ఉండడం విశేషం. మరి జగన్ వీరి మాటలను పట్టించుకుంటాడా.. చూడాలి.


జగన్ 



మరింత సమాచారం తెలుసుకోండి: