యంగ్
హీరో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’. యూ ఆర్ మై
హార్ట్ బీట్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాతో జిఆర్.
కృష్ణ దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన ‘అర్జున్ రెడ్డి’ ఫేం శాలిని పాండే హీరోయిన్గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్
సంగీత మందిస్తున్నారు. అభిమానులకు
దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక రాజ్ తరుణ్కు 'కుమారి 21 ఎఫ్' తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సక్సస్ అందుకోవడం లో వెనకబడిపోయాడు. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ.. బాక్సీఫీస్ వద్ద సాధించడంలో చతికిల పడుతున్నాయి. అయితే సక్సస్ ఫార్ములాకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు మినిమమ్ కంటెంట్ ఉంటే గాని సినిమాను నిర్మించరు. దీంతో 'ఇద్దరిలోకం ఒకటే' తో రాజ్ తరుణ్ మళ్లీ సక్సస్ అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ
సినిమా తర్వాత ఈ కుర్ర
హీరో '
గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన దర్శకుడు కొండా
విజయ్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. 'ఒరేయ్ బుజ్జిగా' టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని శ్రీమతి
లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే మళ్ళీ
రాజ్ తరుణ్ ఫాం లోకి రావడం గ్యారెంటీ అని అందరు అనుకుంటున్నారు. మరి హిట్ దక్కుతుందో లేదో చూడాలి.