యువత సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పరశురాం ఆ తర్వాత తీసిన సినిమాలు అలా అలా ఆడాయి. కానీ ఒక్కసారిగా గీతగోవిందం మాత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి నా సత్తా ఇదా..? అని పరశురాం కే షాకిచ్చింది. ఇక గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తో లాభాల్లో వాటా అందుకుని, గ్రేట్ అనిపించుకున్నాడు. కాని ఆ తరువాత మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఛాన్స్ దొరకలేదు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా అనుకున్నాడు. కానీ అది మాటల దగ్గరే ఆగిపోయింది. ఇక రీసెంట్‌గా వెళ్ళీ ప్రభాస్ కోసం యువి వాళ్ళకు కథ చెప్పారు. కథ ఇంకా ప్రభాస్ దాకా వెళ్ళలేదట. కానీ యువి సంస్థ అధినేతలు మాత్రం విన్నారని సమాచారం.

ఇక తమిళంలో సూపర్ హిట్టయిన పింక్ సినిమాను నిర్మాత దిల్ రాజు-హారిక హాసిని సంస్థ కలిసి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ తో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం డైరక్టర్ ను వెదుకుతున్నారు నిర్మాతలు. అయితే అందరు అనుకుంటున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, వేణు శ్రీరామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయటం లేదట. ఎవరైనా యంగ్ డైరక్టర్ కి  ఛాన్సిద్దామని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పరుశురామ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఎస్ చెప్పాలి కాబట్టి ఆయనకు పరుశురామ్ గురించి చెప్పారట నిర్మాతలు. కాని పవన్ కళ్యాణ్ సింపుల్ గా నో చెప్పినట్లు తెలిస్తోంది. 

ఇక ఈ సినిమాను తమిళంలో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ కూడా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఇక తెలుగులో ఈ రెండు సినిమాలకంటే గొప్పగా తెరకెక్కించాలనే పవర్ స్టార్ తో నిర్మించ గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కి స్క్రిప్ట్ త్రివిక్రమ్ అందిస్తున్నారట. అజ్ఞాత వాసి తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న పింక్ రీమేక్ మీద ఇప్పటికే అంచనాలు మొదలైపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: