తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి అందాల  సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. అనారోగ్య కారణంగా చికిత్సపొందుతూ గుండెపోటుతో ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. గత రెండురోజుల క్రిందం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి.


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన గీతాంజలి.. సహనటుడు రామకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. కాకినాడలో జన్మించిన గీతాంజలి.. మొదట హిందీలో పేయింగ్ గెస్ట్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. శ్రీశ్రీ మర్యాదరామన్న, సీతారామకళ్యాణం, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, తోడ నీడ, లేత మనసులు, దేవత, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢాచారి 116వంటి చిత్రాల్లో ఆమె నటించారు. 


చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి.. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మిలోనూ నటించింది.. ఇక వీరి కుమారుడు ‘భూమ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఇకపోతే 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రం ద్వారా వెండితెరకు పరిచమైన గీతాంజలి.. కలవారి కోడలు, డా. చక్రవర్తి, బొబ్బిలియుద్ధం, దేవత, గూఢచారి116, శ్రీ శ్రీ మర్యాదరామన్న, అవేకళ్లు, సంబరాల రాంబాబు, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించారు.


ఇకపోతే నేటి సినిమాల్లోను గీతాంజలి బామ్మ  క్యారెక్టర్లను పోషించారు. పెళ్లైన కొత్తలో కీలక ప్రాతలోనే నటించారు గీతాంజలి. ఇక ఈ సీనియర్ నటి మృతికి ఎందరో తెలుగు చిత్ర ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటి గీతాంజలి గారు మరణించారు అనే వార్త తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: