పవన్ కళ్యాణ్ ఎవరికైనా మాట ఇస్తే ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన మాటను నిల బెట్టుకుంటాడు అని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సందర్భమే
పవన్ రీ ఎంట్రీ
సినిమా గురించి జరగబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.
పవన్ కు ‘ఖుషీ’ లాంటి
బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన
నిర్మాత ఏ.ఎమ్. రత్నం ను ఆదుకుంటానని గతంలో
పవన్ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిజం చేస్తూ
పవన్ రీ ఎంట్రీలో నటించబోయే సినిమాలలో మొదటి సినిమాగా ఏ.ఎమ్. రత్నం బ్యానర్ లో
క్రిష్ దర్శకత్వంలో ఉండడానికి
పవన్ లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా కొనసాగుతున్న రోజులలో ‘సత్యాగ్రహి’ టైటిల్ తో ఒక సినిమాను చేస్తాడని 2006 ప్రాంతంలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే ఆ మూవీకి టైటిల్ కుదిరింది కాని కథ సరిగ్గా కుదరక పోవడంతో ఆ
మూవీ ఆలోచన క్రియా రూపం దాల్చలేదు.
ఇప్పుడు క్రిష్ ఆ టైటిల్ ను ఆధారంగా చేసుకుని ఒక సామాజిక నేపధ్యం ఉన్న కథ అల్లి
పవన్ ను మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని తీసే అవకాశం ఏ.ఎమ్.రత్నంకు ఇవ్వడం వెనుక మరొక ఉద్దేశ్యం కూడ ప్రభావితం చేసింది అని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించి జరిగే
బిజినెస్ లో
పవన్ తన షేర్ గా 50 కోట్ల పారితోషికం తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
పవన్ క్రిష్ ల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ తో పాటు
పవన్ రీ ఎంట్రీ
సినిమా కాబట్టి ఈ సినిమాకు చాల సులువుగా 150 కోట్లు పైగా
బిజినెస్ జరిగే ఆస్కారం ఉన్న నేపధ్యంలో
పవన్ భారీ డిమాండ్ కు మరొక మాట చెప్పకుండా ఏ.ఎమ్.రత్నం ఈ డీల్ కుదుర్చుకున్నాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి..