సినిమా నటులకు ఇష్టమైన వ్యాపకాలు, ఇష్టాలు ఉంటాయి. షూటింగులతో బిజీగా ఉంటారు. షూటింగ్ లేనప్పుడు కొందరు వెకేషన్స్ కు వెళ్తారు.. మరికొందరు ఇంట్లోనే ఉంటారు. ఫ్యామిలీ, గార్డెనింగ్, పప్పీస్.. ఇలా పలు ఇష్టాలతో గడుపుతూంటారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తనకో గుర్రపుశాల కూడా ఉంది. మగధీరలో తాను పరుగులు పెట్టించిన గుర్రానికి కాజల్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో ఇష్టమైన వ్యాపకాన్ని కూడా ఎంచుకున్నాడు చిట్టిబాబు.

 


బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటివల తన ఫామ్ హౌస్ లో వనరక్షణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొక్కలు నాటడమే కాకుండా తన గోశాలలోని ఆవులకు అరటిపండ్లు తినిపిస్తూ ఎంతో ఉల్లాసంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ సరదాగా తన పొలంతో కలియతిరుగుతుంటే చూసిన ఎవరికైనా జీవితం అలా ఉంటే ఎంత బాగుంటుందో కాదా.. అనిపించక మానదు. రామ్ చరణ్ కు అదే ఫీలింగ్ వచ్చినట్టుంది. బాబాయ్ ఆనందాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. ‘బాబాయ్ ని ఆదర్శంగా తీసుకుని బహుశా నేను కూడా భవిష్యత్ లో ఓ గోశాల నిర్వహించొచ్చు’ అంటూ తన భవాలను షేర్ చేసుకున్నాడు. ఈ పోస్టును నెటిజన్లు కూడా బాగా ఫిదా అయ్యారు.

 


పవన్ ఇలా గోవులకు మేత వేయటం, గడ్డి పెట్టడం కొత్తేమీ కాదు. తనకు కాలక్షేపం కోసం, ప్రశాంతత కోసం అప్పుడప్పుడూ తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా అలా వెళ్లడం ఆ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు సంబరపడుతున్నారు.. షేరింగ్ లతో తమ ప్రతాపం చూపిస్తున్నారు.


view this post on Instagram

Inspired to start a Goshala some time in the near future #karthikamasam

A post shared by ram Charan (@alwaysramcharan) on

మరింత సమాచారం తెలుసుకోండి: