పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నాడని తెలిసిందే. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానన్న పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అయితే కేవలం రాజకీయాల్లోనే ఉంటే తనకున్న ఫ్యాన్స్ బేస్ కూడా పోయేలా ఉందని అనుకున్నాడో ఏమో కాని పవన్ మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 


సినిమాల్లో కొనసాగితే రాజకీయ నాయకుల నుండి విమర్శలు వస్తాయని అనుకుంటున్నాడు. అయినా సరే ఫ్యాన్స్ కోరిక మేరకు పవన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రీ ఎంట్రీలో పవన్ క్రిష్ తో మొదటి సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట. త్వరలోనే ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రానుందట.


ఇక ఇదిలాఉంటే పవన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ కు త్రివిక్రం డైలాగ్స్ ఉంటాయని తెలుస్తుంది. పవన్ త్రివిక్రం ఈ కాంబినేషన్ కు ఒక లెక్క ఉంది. అజ్ఞాతవాసి నిరాశపరచినా మళ్లీ పవన్ త్రివిక్రం కలిసి ఈ రీమేక్ కు పనిచేయడం ఫ్యాన్స్ ను అలరిస్తుంది.


సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా క్రిష్ సినిమా కూడా ఓ పవర్ ఫుల్ స్టోరీతో వస్తున్నాడట పవన్. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో నిరాశపరచిన క్రిష్ పవన్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి పవన్ తో క్రిష్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. పవన్ సినిమా హిట్టు కొడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. క్రిష్ సినిమాతో పాటుగా వేణు శ్రీరాం సినిమాతో కూడా పవర్ స్టార్ అభిమానుల దాహం తీరుతుందని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: