తెలుగురాష్ట్రాల్లో 6వరోజు
విజిల్ 34లక్షలవసూళ్లను రాబట్టగా ఖైదీ 45 లక్షల వసూళ్లను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ
సినిమా వస్తున్న టాక్ తో ఫుల్ రన్ లో భారీ లాభాలనుతీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు
ఖైదీ తెలుగు లో 4.46 కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ కు చేరువైంది. ఇక
విజిల్ ఇప్పటివరకు 9కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో
కోటి రూపాయలను రాబట్టాల్సి వుంది.
ఖైదీ దెబ్బకు విజిల్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి
సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం అందించగా డ్రీం
వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు నిర్మించాడు. తెలుగులో
ఖైదీ ని కేకే రాధామోహన్ విడుదలచేశాడు. ఈచిత్రం
హీరోయిన్ , సాంగ్స్ లేకుండా తెరకెక్కడం విశేషం.