పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ కి  పరిచయం అయ్యి ఇప్పుడు టాలీవుడ్ ఒక మంచి టాప్ హీరోల్లో ఒకరుగా నిలిచినా పవన్ కళ్యాణ్ మొదట నుండి భిన్నమైన  కథ లను ఎంచుకొని కొంత సక్సెస్ అయ్యి  తన నటన ప్రదర్శన తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మరియు  అధిక ఆదరాభిమానాలను చూరగొన్న నటుడు ఇతడు. ఇతడు తీసినవి  25 సినిమాలే అయిన అయన ప్రేక్షకులలో, అభిమానులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.

కాగ గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలలో చురుకుగా పాల్గొని గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు మరియు మోదీ లకు అనుకూలంగా పని చేసి తరువాత సొంత పార్టీ జనసేన ని ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన ఎన్నికలకు సొంతంగా పోటీచేసిన పవన్ కు ఆశించినటువంటి ఫలితాలు రాక పోవడం తో మళ్ళి సినిమాల వైపు చూస్తున్నారు అనే వార్త ప్రచారం లో ఉంది కానీ పవన్ ఎప్పటి వరకు ఆ వార్తల పైన ఏమాత్రం స్పందించలేదు. కానీ పదే పదే వార్తలు రావడం తో అభిమానులకు సినిమా లకు ఎంట్రీ ఇస్తాడని కానీ ఏ దర్శకునితో సినిమా తీస్తాడని ఇప్పుడు అనే విషయాలు బయటకు రాలేదు కానీ ఇటీవల ఒక దర్శకుని దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడని సినిమా కు రంగం సిద్ధమైంది అనే వార్త వైరల్ అవుతుంది.

ఇటీవల జరిగిన ఒక ఫంక్షన్ లో దర్శకుడు క్రిష్ తో చర్చలు జరిపారని  సినిమా తీయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్త పైన లోతుగా విశ్లేషించగా ఇదంతా ఫేక్ న్యూస్ అని నిర్దారణ జరిగింది. ఎలాంటి వార్తల పైన కూడా స్పందించని పవన్ ని చూస్తే కొందరు విశ్లేషకులు నిజమే కావొచ్చు అని గుసగుసలు ఆడుకుంటున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం ఆగి పోయిన సినిమా 'సత్యగ్రహి' కి కూడా అడ్వాన్స్ తీసుకున్నాడని మొదటగా సినిమా లోకి మళ్ళి వస్తే ఆ ప్రాజెక్ట్ ని మొదటగా చేయొచ్చు అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

కానీ పవన్ కొందరు రిపోర్టర్స్ అడిగిన ఇదే ప్రశ్నకు అయన స్పందిస్తూ నేను కేవలం పూర్తి సమయాన్ని రాజకీయాలకు సమాజం లో ఉన్న సమస్యలపైన మాత్రమే కేటాయిస్తానని చెప్పడం జరిగింది కానీ సినిమా లు ఎప్పుడూ సినిమాలోకి  మాత్రం రానని చెప్పక పోవడం తో అభిమానుల్లో మళ్ళి సినిమా లు తీస్తారని ఆశాభావం వక్తం చేసారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: