టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లేడీ
అమితాబ్ విజయశాంతి గారు ఈ
సినిమా ద్వారా
టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో దీనిపై మరింతగా
టాలీవుడ్ ప్రేక్షకుల్లో హైప్ ఉంది.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర
ప్రసాద్,
మురళి శర్మ,
హరితేజ,
శ్రీనివాస రెడ్డి,
సంగీత,
బండ్ల గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా రాక్ స్టార్
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే
మహేష్ మరియు దేవిల కాంబినేషన్లో వచ్చిన
వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు,
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్స్ అందుకోగా,
ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ
సినిమా వాటిని మించి మరింతగా శ్రోతలను అలరిస్తుందని సమాచారం .ఇక ఈ సినిమాలోని ప్రత్యేక గీతం,
సినిమా మొత్తానికే హైలైట్ అని అంటున్నారు. మిల్కీ
బ్యూటీ తమన్నా మహేష్ తో కలిసి చిందేయనున్న ఈ సాంగ్ కోసం దేవిశ్రీ అదిరిపోయే
మాస్ బీట్ ఒకటి ఇచ్చారని, బందరు మిఠాయి రావోయి సిపాయి అనే పల్లవితో సాగె ఈ సాంగ్ కి థియేటర్లో
సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈలలు గోలలతో హోరెత్తించడం ఖాయం అని టాక్. అయితే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన
మహర్షి సాంగ్స్ పై
మహేష్ ఫ్యాన్స్ కొందరు సంతృప్తి చెందకపోవడంతో,
ఈసారి ఎలాగైనా వారికి మంచి ఫీస్ట్ అందించేలా దేవిశ్రీ ఈ సినిమాలోని సాంగ్స్ కోసం ఎంతో కష్టపడ్డారట. ఇక అతి త్వరలో ఈ సినిమాలోని ఒక్కొక్క సాంగ్
యూట్యూబ్ ద్వారా రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ
సినిమా, త్వరలో సాంగ్స్ రిలీజ్ తరువాత మరిన్ని అంచనాలు పెంచడం ఖాయమని అంటున్నారు
సినిమా యూనిట్ సభ్యులు.
సంక్రాంతి కానుకగా
జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ
సినిమా ఎంత మేర
సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!!