బాలీవుడ్ లో కొంత కాలంగా ఖాన్ త్రయం నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఈ ముగ్గురు టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే అమిర్ ఖాన్ ఎప్పుడూ మిస్టర్ పర్ఫెక్ట్ అని అందరికీ తెలిసిందే. ఇక కరణ్ అర్జున్ సినిమా తర్వాత షారూఖ్- సల్మాన్ ఖాన్ కి మద్య కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయని..వారిద్దరూ శత్రువులుగా మారారని అప్పట్లో బాలీవుడ్ లో టాక్ వినిపించింది. కానీ ఈ విషయాన్ని ఇద్దరు హీరోలు ఖండించారు..తాము ఎప్పటికీ మంచి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి హస్ట్ గా కూడా చేశారు. 
ఆ మద్య షారూఖ్ నటించిన జీరో సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ సాంగ్ లో నటించగా..సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. తాజాగా మితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అర్చనా సదానంద్ లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి...దాంతో అందరూ అక్కడ నుంచి భయపడి వెళ్లిపోగా షారూఖ్ ఖాన్ మాత్రం ధైర్యం చేసి మంటలు అదుపు చేశారు.
అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలు కాగా, షారూఖ్ కూడా కొద్ది గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో ఒక్కసారే వైరల్ అవ్వడంతో షారూఖ్ పై బాలీవుడ్ వర్గాలు ప్రశంసల జల్లు కురిపించసాగాయి. ఈ సదంర్భంగా తన స్నేహితుడి ధైర్య సాహసాలు మెచ్చుకుంటూ సల్మాన్ ఖాన్ ఓ వీడియో పంపాడు. ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాలోని ఓ క్లిప్ షేర్ చేసాడు. ఇందులో షారూఖ్ న‌టించగా, స‌ల్మాన్ వాయిస్ ఓవ‌ర్ అందించాడు. రియల్ హీరో అంటూ ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. మంటల్లోకి దూకి ప్రాణాలను కాపాడేవాడే నిజమైన హీరో అంటూ ట్వీట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: