టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది రేణు దేశాయ్.  ఆ తర్వాత పవన్ - రేణు జంటగా ‘జాని’ సినిమాలో కనిపించారు.  అయితే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరి మద్య ప్రేమచిగురించింది.  పెద్దల సమక్షంలో ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.  అయితే పవన్ కళ్యాన్ ని వివాహం చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పారు. 

ఏడు సంవత్సరాల్లో వీరి కాపురం సజావుగా సాగినా కొన్ని అనివార్య కారణాల వల్ల విడాలకులు తీసుకున్నారు.  అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు జన్మించారు.  విడాకులు తీసుకున్న తర్వాత పవన్ హీరోగా నటించిన ‘తీన్మార్’ హీరోయిన్ అన్నా లెజెనివా ను వివాహం చేసుకున్నారు.  రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న తర్వాత పూనేలో స్థిరపడ్డారు.  ఆమెవద్దే పవన్ కుమారుడు అకీరా, ఆద్యలు పెరుగుతున్నారు. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత మరాఠీలో దర్శకురాలిగా ఒక సినిమా, అలానే  నిర్మాతగా మరో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో రైతుల బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. 

ఓ వైపు వృత్తిపరంగా బిజీగా ఉంటూనే.. తన పిల్లలతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య తమ తండ్రి పవన్ కళ్యాణ్  వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా పవన్ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.  గతంలో రేణు దేశాయ్ ఓ వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రేణుదేశాయ్ వెకేషన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లింది. ఒంటరిగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.  ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

view this post on Instagram

. If the mountains are my heart, now I know that the ocean is my soul... Especially during this Maldivian vacation, after spending hours of swimming in the ocean alone, I realised that I have the soul of a fish! The irony is that fire is my favourite element. I am fascinated with the concept of fire but I feel absolutely at home in water! I guess that is what life is about! Ironies and paradoxes!

A post shared by renu desai (@renuudesai) on

మరింత సమాచారం తెలుసుకోండి: