సినిమా రంగం అంటేనే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కలిసివస్తే రాత్రికి రాత్రే ఒక నిర్మాత లేదా హీరో టాప్ రేంజ్ కి చేరుకుంటారు. ఈ సెంటిమెంట్ల కోసం నిర్మాతలు తమకు కలిసి వచ్చిన ప్రదేశాలలో సినిమాలను షూట్ చేస్తారు. అంతేకాదు తమ సినిమాలను కూడా తమకు కలిసి వచ్చే తేదీలలో, నెలలలో విడుదల చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబుతో సంక్రాంతికి ఢి కొట్టబోతున్న రామ్ చరణ్ ‘ఎవడు’ చుట్టూ ఒక విచిత్రమైన సెంటిమెంట్ చక్కర్లు కొడుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  మొదట్లో ‘ఎవడు’ సినిమాను ప్రారంభించే ముందు శ్రుతిహాసన్ స్థానంలో సమంతను అనుకున్నారు కాని కొన్ని కారణాలవల్ల సమంత బదులు శ్రుతి ‘ఎవడు’ ప్రాజెక్ట్ లో చేరింది. అప్పటికే ‘గబ్బర్ సింగ్’ ఘన విజయంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయిన శ్రుతి ‘ఎవడు’ లో చేరడంతో ఇక ఈ సినిమాకు ఎదురు లేదు అని అనుకున్నారు అంతా. కానీ ఈ సంవత్సరం జూలైలో విడుదల కావలసిన ఈసినిమా రాజకీయ ఉద్యమాలకు భయపడి ‘ఎవడు’ విడుదల ఎప్పుడో దిల్ రాజ్ కే తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావలసి ఉన్న మళ్ళీ సంక్రాంతి రేసుకు వెళ్ళిపోయింది. ఈ గేప్ లో ఇప్పటి దాకా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రుతి ‘రామయ్యా’ సినిమా పరాజయంతో ఒక భయంకరమైన ఫ్లాప్ ను చూసింది.  అదీకాకుండా శ్రుతికి సంక్రాంతి గతంలో పెద్దగా కలిసి వచ్చిన దాఖలాలు లేవు. 2011లో శ్రుతి నటించిన భారీ సినిమా ‘అనగనగా ఓధీరుడు’ ఘోరంగా ఫ్లాప్ అయింది. మళ్ళీ అదే సంక్రాంతికి వస్తున్న శ్రుతి నటించిన ‘ఎవడు’ సినిమాను శ్రుతికి కలిసిరాని సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడు తుందా అనే ఆసక్తికర చర్చలు వినపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: