బుల్లితెరపై పాపులర్ షో బిగ్ బాస్ 3 చివరి అంకానికి చేరుకుంది. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్లలో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ శ్రీముఖి, రాహుల్ లలో ఒకరు విజేతగా నిలుస్తారని సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. ఇక నుంచి ఈ షోకు అభిమానుల ఓటింగ్ కీలకం కానుండగా.. తమకు ఇష్టమైన కంటెస్టంట్లను గెలిపించడానికి వారి అభిమానులు తీవ్రంగా కష్టపడుతున్నార. అటు హూస్ మేట్స్ కూడా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతుండగా.. ఆయా కంటెస్టంట్లకు మద్దతుగా కొందరు సెలబ్రెటీలు కూడా పోస్టులు పెడుతున్నారు


   బిగ్ బాస్ విన్నర్ రేసులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖికి ఇప్పటికే బుల్లితెర యాంకర్ రష్మీ మద్దతు తెలుపగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ రాహుల్ కు మద్దతుగా సింగర్ నోయల్ ట్వీట్ చేశాడు. అటు అలీ రెజాకు కూడా బుల్లితెర నుంచి పలువురు నటుల మద్దతు లభిస్తోంది. 


   తాజాగా బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న సింగర్ గీతామాధురి, నటి హరితేజలు సోషల్ మీడియా వేదికగా తమకు ఇష్టమైన కంటెస్టంట్లు గెలవాలని పరోక్షంగా కోరుకున్నారు. బిగ్ బాస్ లో ఫైనల్ లిస్టులో మిగిలిన వారందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ పెట్టిన గీతామాధురి.. శ్రీముఖి, రాహుల్ లతో సపరేట్ గా దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో శ్రీముఖి, రాహుల్ లలో ఎవరో ఒకరు గెలవాలని ఆమె కోరుకుంటున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఎవరికో ఒకరికి మద్దతు తెలపలేక గీత ఇలా చేసిందని అనుకుంటున్నారు.


 అటు హరితేజ తనకు ఇష్టమైన శ్రీముఖి, రాహుల్ లలో ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇకపై ప్రేక్షకుల ఓట్లతోనే కంటెస్టెంట్ల భవిష్యత్తు తేలనుండా.. చివరికి బిగ్ బాస్ కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: