సూపర్ స్టార్ రజినీకాంత్ - మాస్ డైరెక్టర్  శివ డైరెక్షన్ లో ఓ సినిమా తెరక్కనుందని తెలిసిందే.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం  త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇక ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు గా  వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి  వయోగం అనే టైటిల్ ను పెట్టారని  కోలీవుడ్  మీడియా వెల్లడించింది. అయితే మేకర్స్ నుండి మాత్రం  అధికారికంగా ఎలాంటి ప్రకటన  వెలుబడలేదు. 



ఈచిత్రంలో రజినీ సరసన  సీనియర్ నటి జ్యోతిక ,  ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్  హీరోయిన్లుగా నటించనున్నారని సమాచారం.  ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది  ప్రారంభంలో పేట తో ప్రేక్షకులముందుకు  హిట్ కొట్టిన  రజినీ ఆతరువాత  పెద్దగా గ్యాప్ తీసుకోకుండా   స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ చిత్రాన్ని మొదలు పెట్టాడు.  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది. 



రజినీ-మురగదాస్  కాంబినేషన్ లో వస్తున్న  మొదటి సినిమా  కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.  వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  ఆయనకు జోడిగా నయనతార నటించింది.  ఇక వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: