సూపర్ స్టార్ రజినీకాంత్ - మాస్ డైరెక్టర్
శివ డైరెక్షన్ లో ఓ
సినిమా తెరక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు గా వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి వయోగం అనే టైటిల్ ను పెట్టారని కోలీవుడ్
మీడియా వెల్లడించింది. అయితే మేకర్స్ నుండి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు.
ఈచిత్రంలో
రజినీ సరసన సీనియర్ నటి
జ్యోతిక , ట్యాలెంటెడ్
బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించనున్నారని సమాచారం. ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలో పేట తో ప్రేక్షకులముందుకు హిట్ కొట్టిన
రజినీ ఆతరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో
దర్బార్ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇటీవలే ఈ
సినిమా షూటింగ్ కూడా పూర్తైయింది.
రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో
దర్బార్ పై
తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా
నయనతార నటించింది. ఇక వీరితోపాటు
బాలీవుడ్ ప్రముఖ నటులు
సునీల్ శెట్టి ,
ప్రతీక్ బబ్బర్ ,
దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.