ఒక టాప్
హీరో సినిమాకు వంద రోజులు ముందుగా ప్రమోషన్ మొదలు పెట్టడం అత్యంత సాహసం. అయితే
అల్లు అర్జున్ ఒత్తిడితో
త్రివిక్రమ్ కు ఇష్టం లేకపోయినా ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన పాటల విడుదల చాల ముందుగా ప్రారంభం కావడమే కాకుండా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు పాటలు విడుదల అయ్యాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘రాములో రాముల’ ట్యూన్ వినపడుతోంది. ప్రతిరోజు ఈ పాటకు మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. దీనితో బన్నీ అభిమానులు ఈ
మూవీ బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నారు. అయితే ఈమూవీ దర్శకుడు
త్రివిక్రమ్ మాత్రం ఈ మ్యానియాను చూసి హడిలిపోతున్నట్లు సమాచారం.
ఇంకా ఈసినిమాకు సంబంధించి మూడు పాటలు అందులో ఒక పాటను ఈ
నవంబర్ లో విడుదల చేస్తే మరో రెండు పాటలను
డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు.
తమన్ అందించిన ట్యూన్స్ సూపర్ క్లిక్ అయిన నేపధ్యంలో ఈ పాటల చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉండబోతోంది అన్న ఊహలలో బన్నీ అభిమానులు విపరీతమైన కలలు కంటున్నారు.
ఇప్పుడు ఈ అంచనాలే
త్రివిక్రమ్ కు భయాన్ని కలిగిస్తున్నట్లు సమాచారం. ఒక టాప్
హీరో సినిమాకు
ఆడియో సూపర్ హిట్ అయిన తరువాత ఆ మూవీకి సంబంధించిన కథ అదేవిధంగా డైలాగ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయని అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనితో ఈ అంచనాలలో ఏ కొద్ది తేడాలు వచ్చినా
సినిమా రిజల్ట్ పై చాల నెగిటివ్ ప్రభావాన్ని చూపెడుతుంది. లేటెస్ట్ గా విడుదలైన ‘సాహో’ విషయంలో కూడ ఇలా అంచనాలు తారుమారు అవ్వడంతో ఆ
మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు ఈ విషయాలు అన్నీ
త్రివిక్రమ్ ఆలోచనలలోకి రావడంతో ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఇంత ముందుగా ఏర్పడ్డ మ్యానియా ఈ మూవీకి ప్లస్ అనుకోవాలా లేకుంటే మైనస్ అనుకోవాలా అన్న విషయాలు ఎంత అనుభం ఉన్న
త్రివిక్రమ్ ను కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్..