క్రేజీ హీరో
విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయోగం ‘మీకు మాత్రమే చెప్తా’ ఓవర్సీస్ ప్రేక్షకులకు బాగా నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు నిన్నరాత్రి
హైదరాబాద్ లో జరిగిన ఈ
మూవీ సెలెబ్రెటీ ప్రివ్యూ చూసిన కొందరు ఈ
మూవీ చాలబాగుంది అని లీకులు ఇస్తున్న నేపధ్యంలో ఈరోజు ఉదయం నుండే ఈ
మూవీ పై పాజిటివ్ టాక్ వస్తోంది.
ఒక కొత్త దర్శకుడు కొత్త
నిర్మాత కొత్త నటీనటులతో చేసిన ప్రయోగం విజయవంతం అయింది అంటూ వస్తున్న ఈ ప్రాధమిక టాక్ నిలబడగలిగితే
విజయ్ దేవరకొండ నిర్మాతగా సూపర్ సక్సస్ సాధించినట్లే అని అంటున్నారు. ఈ
మూవీ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు
కామెడీ ఉండటంతో ఈ సీన్స్ కు ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నట్లు టాక్.
ముఖ్యంగా ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ స్కిల్స్ అదిరిపోయాయి అంటూ ఇక రానున్న రోజులలో దర్శకుడుగా ఊహించుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఈ
మూవీ ఎక్కడా బోరుకొట్టించకుండా ఒక్క అనవసరపు సీన్ కూడ లేకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో భారీ నిడివితో కూడుకున్న సినిమాలు ఎక్కువగా వస్తున్న పరిస్థితులలో చిన్న నిడివితో వచ్చిన ఈ
మూవీ ఓవర్సీస్ ప్రేక్షకులకు రిలాక్స్ కలిగిస్తోంది అని అంటున్నారు. ఈ
మూవీ సగటు ప్రేక్షకుడు చూడవలసిన
సినిమా అంటూ టైటిల్స్ మొదలైనప్పటి నుంచి ఎండ్ టైటిల్ కార్డు వరకు వినోదంతో నిండిపోయింది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు తమ స్పందనను వారి ట్విట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. ‘ఇప్పటికే మేము నవ్వుకున్నాం మీరు కూడ వచ్చి నవ్వులలో మునిగిపొండి’ అంటూ
నిర్మాత మధురా
శ్రీధర్ చేసిన ట్విట్ తో ఈమూవీ ఇక్కడ కూడ హిట్ అవ్వుతుంది అన్న అంచనాలు ఉన్నాయి..