తెలుగు లో బిగ్ బాస్ 3 కౌంట్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటి సభ్యులు ఫైనల్ కి ఎవరు వెళ్తారు అన్న కాంట్రవర్సీ నడుస్తుంది. ఏవరికి వారే తాము ఫైనల్ లో ఉన్నాం..గెలుపు మాదే అన్నట్లు ఫీల్ అవుతున్నారు. ఇక వారికి సపోర్ట్ చేసేవారు కూడా తమ వాళ్లే ఖచ్చితంగా గెలుస్తారు..కాస్త సపోర్ట్ చేసి ఓటింగ్ వేయండి అంటూ ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పదిహేడు మంది కంటెస్టంట్స్ తో ఈ షో మొదలుకాగా ఫైనల్స్ కి ఐదుగురు చేరుకున్నారు. వీరిలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య ఓటింగ్ విషయంలో పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు విజేతగా నిలవనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం హౌజ్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆ రోజు తేలిపోనుంది. అయితే ఫినాలేని భారీ ఎత్తున జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఈ కార్యక్రమంలో అంజలి, క్యాథరిన్, నిధి అగర్వాల్ స్పెషల్ డ్యాన్స్లతో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. హౌస్ లో వారివంద రోజుల జర్నీని వీడియోగా రూపొందించి ప్లే చేశారు. ముందుగా వరుణ్, ఆ తరువాత రాహుల్, బాబా భాస్కర్ ల వీడియోలు ప్లే చేసి చూపించారు. అలీ రెజాకి తన జర్నీ వీడియో ప్లే చేసి చూపించగా.. అలీ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు.మోకాలి మీద కూర్చొని బిగ్ బాస్ కి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు.
శ్రీముఖి కన్నీరు పెట్టుకుంటూ బిగ్ బాస్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. దీని తరువాత హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ లోని వస్తువులు ఉపయోగించి కొత్తరకం యాడ్స్ క్రియేట్ చేసి కామెడీ, ఎమోషన్ లాంటి వాటితో మెప్పించాలని చెప్పాడు. ఇంటి సభ్యులు అందుకు అనుగుణంగా తమ వంతు కష్టం పడ్డారు. ఆదివారం సాయంత్రం 6గం.లనుండి ప్రారంభం కానుంది. రాహుల్ ప్రస్తుతం టాప్లో కొనసాగుతుండగా, ఆయనే బిగ్ బాస్ విజేతగా నిలుస్తాడని అంటున్నారు