టాలీవుడ్ లో సుకుమార్ డైరెక్షన్ అంటే కొన్ని లెక్కలు ఉంటాయి.  స్వతహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ తన డైరెక్షన్ లో కూడా ఈ ఫార్ములా ఉపయోగిస్తుంటారు.  గత సంవత్సరం సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రాంచరణ్ చెవిటి వాడి పాత్రలో నటించాడు.  ‘రంగస్థలం’ లో రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  ఇక ఈ మూవీలో అక్కినేని సమంత అచ్చమైన పల్లెటూరి పిల్లలా నటించింది. 

1983 కాలం నాటి పరిస్థితులు, రాజకీయ కోణంలో చిత్రీకరించారు.  విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశారు. 

ఇక కోలీవుడ్ లో రంగస్థలం రైట్స్ ప్రముఖ దర్శకులు, నటులు లారెన్స్ దక్కించుకున్నారు.   ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ రోల్ పోషించ‌నున్నాడ‌ట‌. పాపుల‌ర్ త‌మిళ ద‌ర్శక‌డు లింగుస్వామి మూవీ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం. రాంచరణ్ నటించిన ‘రంగ‌స్థ‌లం’ మూవీ బాక్సాఫీస్ దగ్గ‌ర దాదాపు 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు సాధించిన విష‌యం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: