టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏనాడైతే అర్జున్ రెడ్డి సినిమా తో అదిరిపోయే హిట్టు విజయ్ దేవరకొండ కొట్టాడో అప్పుడే విజయ్ దేవరకొండ తలరాత మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతగా అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ ని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో గా మార్చేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా కూడా క్లాసికల్ గా అదిరిపోయే హిట్ అందుకోవటం మరియు అదే విధంగా వరుస ఆఫర్లు రావడం తో విజయ్ దేవరకొండ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ కే పరిమితం కాకుండా తన మార్కెట్ మొత్తం సౌత్ ఇండస్ట్రీలో వ్యాపించాలని సౌత్ లో ఉన్న ఇతర ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్నాడు.


ఇదే తరుణంలో నిర్మాతగా మారి తనని పెళ్లి చూపుల తో ఇండస్ట్రీకి  పరిచయం చేసిన డైరెక్టర్ ని హీరోగా పెట్టి 'మీకు మాత్రమే చెబుతా' అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుసగా నాలుగు సినిమాలు చేయటానికి ఒప్పుకోవడంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ బుక్ అయిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ఫేమస్ లవర్ సినిమా మొదటగా విడుదల కానుంది.


ఆ తర్వాత  హీరో అనే మరో సినిమాను విజయ్ రిలీజ్ చేయనున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మైత్రి మేకర్స్ నిర్మిస్తోంది. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్ లో కూడా విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడు. నిన్ను కోరి - మజిలీ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ మొదటిసారి విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేస్తుండడంతో ఆడియెన్స్లో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. వీటన్నిటితో పాటు విజయ్ డిసెంబర్ లోనే పూరి జగన్నాథ్ తో 'ఫైటర్' అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు విజయ్ దేవరకొండ. 



మరింత సమాచారం తెలుసుకోండి: