‘గీత గోవిందం’’ సూపర్ సక్సస్ తరువాత దర్శకుడు పరుశురామ్ కు చిన్న హీరోల దగ్గర నుండి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయితే పరుశురామ్ దృష్టి మాత్రం టాప్ హీరోల పై ఉండటంతో అల్లు అర్జున్ మహేష్ లకు రకరకాల కథలు చెపుతూ నెలలు తరపడి సమయాన్ని వృథా చేసుకున్నాడు. 

అయితే వారిద్దరి దగ్గర నుండి నెగిటివ్ సమాధానం వచ్చినా నిరుత్సాహ పడకుండా లేటెస్ట్ గా ప్రభాస్ కు ఒక కథ చెప్పి మెప్పించాలని ప్రయత్నించాడు. ప్రభాస్ ఆ కథ తనకు నచ్చింది అని చెపుతూ కొంత కాలం వెయిట్ చేయమని పరుశురామ్ తో చెప్పినట్లు సమాచారం. అయితే ఆకాలం ఎంత అన్నది ప్రభాస్ పరుశురామ్ కు క్లారిటీ ఇవ్వడం లేదు అని టాక్. 

ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ రీమేక్ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్న దిల్ రాజ్ పరుశురామ్ పేరును పవన్ వద్ద సూచిస్తే ‘పింక్’ లాంటి సీరియస్ మూవీలకు పరుశురామ్ సరిపోడు అంటూ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో టాప్ హీరోల పై పరుశురామ్ పెట్టుకున్న ఆశలు అన్నీ ఆవిరి అయిపోయినట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పుడు యూటర్న్ తీసుకుని పరుశురామ్ చిన్న హీరోల వైపు తన దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇప్పుడు కొద్దిగా మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోలు కూడ వేరువేరు ప్రాజెక్ట్స్ కు ఫిక్స్ అయిపోయిన పరిస్థుతులలో అల్లు అరవింద్ లాంటి నిర్మాత సహకారం ఉండి కూడ పరుశురామ్ ఏమిచేయలేకపోతున్నాడని టాక్. దీనితో పరుశురామ్ తో సినిమా చేయడానికి ఇప్పటికే రెడీగా ఉన్న అల్లు శిరీష్ తప్ప ప్రస్తుతం పరుశురామ్ దగ్గర మరే హీరో రెడీగా లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సూపర్ హిట్ ఇచ్చిన ఒక దర్శకుడుకి ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఏమిటి అంటూ కొంతమంది ఆశ్చర్యపడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: