టాలీవుడ్ లో ‘జర్ని’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగింటి అమ్మాయి తర్వాత విక్టరీ వెంకటేశ్, మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించింది.  ఈ మూవీలో అంజలి అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా అమాయకమైన మాటలతో అందరినీ ఆకట్టుకుంది.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది.  హీరోయిన్ గా నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోతుంది. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా ఆ హాట్ బ్యూటీ మురిపిస్తుంది. 

ఇక టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న అనుష్క ‘భాగమతి’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటిస్తుంది.అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన న్యూస్ మాత్రం ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి.  ఈ మూవీ కి సంబంధించిన అనుష్క, మాధవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  ఈ మూవీలో అంజలి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్  పోస్టర్ ని రిలీజ్ చేసింది. యూఎస్ కి చెందిన క్రైమ్ డిటెక్టివ్ ఆఫీసర్ మాహా అనే పాత్రలో విభిన్న స్వభావంతో అంజలి పాత్ర అలరిస్తుందట.

ఆమె స్పెషల్ గా అనుష్క క్యారెక్టర్ ని టార్గెట్ చేసే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.  షూటింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ టీజర్ ని నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘నిశ్శబ్దం’ మూవీ మల్టీ లాంగ్వేజ్ లోనేకాదు హాలీవుడ్ లో సైతం రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమాతో నటి అంజలి అదృష్టం ఏమైనా మారుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: