టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్ భామలు సందడి చేశారు.  కెరటం సినిమాతో తెలుగు తెరపైకి అడుగు పెట్టింది బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.  ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయం అందుకుంది.  స్వతహాగా మోడలింగ్ నుంచి వచ్చిన రకూల్ ప్రీత్ సింగ్ గ్లామర్ పాత్రలకు ఈజీగా ఒకే చెప్పేయడంతో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. 

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.  ప్రస్తుతం తమిళంలో ఒకటీ రెండు సినిమాల్లో నటిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరపడింది.  ఇక సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో రకూల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ని హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తుంది.  వైకుంఠ బోను దర్శకత్వంలో  రమ్య - శ్రీధర్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘నిన్నే పెళ్లాడుతా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒకప్పుడు కృష్ణవంశి దర్శకత్వంలో నాగార్జున - టబూ నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. 


అప్పటి నుంచి నాగార్జున ఫ్యామిలీ హీరోగా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.  ఈ మూవీతోనే టబూ వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  అయితే అమన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సిద్ధిక' అనే హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇప్పటి వరకు రెండు యాక్షన్ సీన్లు, రెండు పాటల మినహా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది.

ఈ మూవీలో సాయికుమార్, సీత, ఇంద్రజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మరి ఈ సినిమాతో రకూల్ సోదరుడు మంచి సక్సెస్ సాధించి తెలుగు యంగ్ హీరోల్లో ఒకరిగా ఉంటారా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: