తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటీ రెండు సినిమాల్లో నటిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరపడింది. ఇక సినీ పరిశ్రమలో వారసులు ఎంట్రీ ఇస్తున్న తరుణంలో రకూల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ని హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తుంది. వైకుంఠ బోను దర్శకత్వంలో రమ్య - శ్రీధర్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘నిన్నే పెళ్లాడుతా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒకప్పుడు కృష్ణవంశి దర్శకత్వంలో నాగార్జున - టబూ నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ఈ మూవీలో సాయికుమార్, సీత, ఇంద్రజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మరి ఈ సినిమాతో రకూల్ సోదరుడు మంచి సక్సెస్ సాధించి తెలుగు యంగ్ హీరోల్లో ఒకరిగా ఉంటారా లేదా అన్నది చూడాలి.