సూపర్
పవర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాణిస్తూనే నిర్మాతగా మారిపోయాడు.
పెళ్లి చూపులు
సినిమా రిలీజ్కు ముందు ఎదురైన చేదు అనుభవాలు, గుణపాఠాలను దృష్టిపెట్టుకొన్న
విజయ్ దేవరకొండ ఎప్పటికైనా నిర్మాతగా మారాలని ఒట్టు వేసుకొన్నాడట.
నవంబర్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో మీకు మాత్రమే చెబుతా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
ఎవడే సుబ్రమణ్యం తర్వాత మేము తీసిన పెళ్లిచూపులు సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు చేరే వేసేందుకు పక్కాగా
ప్లాన్ వేసి నన్ను ఇంతటి వాడిని చేశారు. ఆ తర్వాత బుజ్జిసార్ నాకు గీతా గోవిందం ఇచ్చారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సార్ నాకు ఫైటర్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను మరికొందరికి అండగా నిలువాలని అనుకొన్నాను. ఆ క్రమంలోనే మీకు మాత్రమే చెబుతా సినిమాను రూపొందించాను. నిర్మాతగా నన్ను దీవించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ
విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.
పెళ్లి చూపుల తర్వాత
అర్జున్ రెడ్డి నా కెరీర్ను మలుపు తిప్పింది. నాతో
సినిమా తీయడానికి దర్శకుడు
సందీప్ రెడ్డి వంగ తన ఇంటిని కుదువ పెట్టి డబ్బు సమకూర్చాడు. ఆ
సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. అలా
అర్జున్ రెడ్డి నాకు ఓ జీవితాన్ని ప్రసాదించింది. అప్పుడే నా మాదిరిగా మరొకరు కష్టపడకూడదు అనిపించింది. అందుకే షమ్మీర్ సుల్తాన్ కథ చెప్పగానే
సినిమా తీయాలనుకొన్నాను అని
విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
మీకు మాత్రమే చెబుతా
సినిమా రిలీజ్ ముందు..
తరుణ్ భాస్కర్ చెప్పిన విషయాలను నాకు బాగా నచ్చాయి. మీరు కనుక లేకపోతే చాలా మంది కెరీర్ ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం. ఈ
సినిమా వల్ల
అవంతిక,
వాణి లాంటి యాక్టర్ల ప్రతిభ సినీ లోకానికి తెలుస్తుంది.
తరుణ్, అభినవ్ గోమటం
కామెడీ, యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది అని
విజయ్ దేవరకొండ చెప్పారు.