ప్రముఖ నటుడు-చిత్రనిర్మాత  కమల్ హాసన్ భారతీయ సినిమాలో 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మూడు రోజుల నవంబర్ 7 నుండి 9 వరకు చెన్నైలో ఇంకా  స్వస్థలమైన పరమకుడిలో ఉత్సవాలు జరగనున్నాయి .వేడుకల్లో భాగంగా కమల్ తన గురువు, రచయిత, దర్శకుడు శ్రీ.కె. బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.ఈ కార్యక్రమం కి  సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే  అవకాశం ఉంది.


కమల్ హాసన్ స్థాపించి నాయకత్వం వహిస్తున్న నిర్మాణ , పంపిణీ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ ఉత్సవాలు గురించి వివరాలను విడుదల చేసింది.కమల్ హాసన్ గారు కేవలం మూడు సంవత్సరాల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అతను 1960 లో వచ్చిన తమిళ చిత్రం "కలతూర్ కన్నమ్మ" లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు, దీనికి రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అప్పటి నుండి తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషలలో 200 కి పైగా చిత్రాలలో నటించారు.


"నాయకన్", "మహానది", "పుష్పాక్" మరియు "సద్మా" వంటి అనేక అద్భుతమైన  పాత్రల వల్ల అతను ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఆర్యాదుడు .కమల్ హాసన్ మహాత్మా గాంధీ 150 వ జయంతిని  తన 2000లో నటించిన  చిత్రం "హే రామ్" ను ప్రదర్శించడం ద్వారా కూడా జరుపుకోనున్నారు. ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహించారు,రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించారు ఇంకా షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. 


మ్యూజిక్ మాస్ట్రో ఇలయరాజాకు ఘనమైన సంగీత నివాళితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.గత ఏడాది ఫిబ్రవరి 21 న కమల్ హాసన్ మక్కల్ నీది మయం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇటీవల, అతను తన రాజకీయ జీవితంతో నిమగ్నం అయ్యాడు త్వరలో జరగబోయే 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ప్రారంభించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: