స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు లుక్ కంప్లీట్ గా మారుస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్నాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 
 
థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా విడుదలైన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. కొన్నిరోజులక్రితం ఈ సినిమాకు ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలోని తన లుక్ కోసం రెండు నెలల పాటు కష్టపడబోతున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ గెటప్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం అందుతోంది. 
 
ఆర్య, ఆర్య2 సినిమాల తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు రంగస్థలంలాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ అల్లు అర్జున్ కు కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇవ్వాలని భావిస్తున్నాడట. అల్లుఅర్జున్ కు జోడీగా రష్మిక ఈ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. 
 
దేవీశీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు పనిచేసే సాంకేతిక వర్గం, నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020 దసరా పండుగకు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: