అప్పుడెప్పుడో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. అప్పట్లో దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే ఒక హాట్ టాపిక్ గా మారింది. సహజంగా బన్నీ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. అలాంటిది తనకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. బన్నీకి కాస్త సహనం తక్కువ అని అందరికీ తెలిసిందే. అందుకే ఇంతకుముందు ఆడియో ఫంక్షన్ లో తను మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో వివాదాన్ని రేకెత్తించింది.

అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకంటారా? ఎందుకంటే అచ్చం అలాగే డ్యాన్సర్లపై బన్నీ మండిపడ్డాడని సమాచారం. అదేంటంటే 'అల వైకుంఠపురం' లోని రాములో రాముల పాట కోసం బన్నీ ప్రత్యేకంగా ముంబై నుంచి డాన్సర్ లను రప్పించాడట. అందుకుగాను లోకల్ డాన్సర్స్ బన్నీ పై ద్వేషం పెంచుకున్నారు. అయితే లోకల్ డాన్సర్ లను మన సినిమాల్లో తప్పక తీసుకోవాలి అని ఒక రూల్ ఉంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వారిని కూడా తీసుకున్నారు.

ఇక్కడే బన్నీ తన తెలివిని ప్రదర్శించాడు. పాటలో ముందువరుసలో ముంబై డ్యాన్సర్ లను వెనకాల లోకల్ డాన్సర్ లను ఉంచారట. ఇక పాటలోని కెమెరాలు హీరో చుట్టూ అలాగే ఫ్రంట్ ప్లేస్ లో ఉన్న ముంబై డాన్సర్లు చుట్టూనే తిరుగుతూ ఉంది కాబట్టి లోకల్ డాన్సర్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా ఎక్కడో చివరి వరుసలో నిలబెట్టారు. బన్నీ అంతటితో ఆగక ముంబై డ్యాన్సర్ లను మరియు లోకల్ డాన్సర్ లను పిలిపించి కొన్ని స్టెప్స్ వేయమన్నాడట. అలా లోకల్ డ్యాన్సర్ లను పిలిపించి వాళ్ళ స్టెప్పుల్లో ఉన్న తప్పులను ఎత్తి చూపించి క్లాస్ పీకాడట. అక్కడున్న లోకల్ డాన్సర్లు బన్నీకి ఇంత కోపం పనికిరాదంటూ పెదవి విరుస్తున్నారని సమాచారం.

ఈ విషయంపైనే అప్పుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర అ బన్నీ ఫ్లెక్స్ లో వెలిశాయి. అది చూసిన బన్నీ అందుకు కారణమైన వారిని పిలిపించి ఇంకొక రౌండ్ మళ్లీ క్లాస్ పీకాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: