'ఝుమ్మంది నాదం', సినిమాలో గ్లామరస్ పాత్రతోనే
టాలీవుడ్ కి పరిచయమయ్యారు తాప్సి. ఈ
సినిమా తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీర' 'షాడో' వంటి సినిమాల్లో గ్లామరస్గా కనిపించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎవరైనా తెలుగులో డీగ్లామ్ పాత్రల్లో నటించి బాలీవుడ్లో గ్లామరస్ పాత్రల్లో నటిస్తారు. కానీ తాప్సి ఈ విషయంలో రివర్స్. బాలీవుడ్లో మాత్రం హోమ్లీ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాప్సి ఎంచుకునే సినిమాలకు మిగతా హీరోయిన్లు ఎంచుకునే సినిమాలకి ఎంత డిఫరెన్స్ ఉందో కనిపిస్తూనే ఉంది. విభిన్నమైన కథా సినిమాలతో తన స్టార్ ఇమేజ్ ని పెంచుకున్న తాప్సి ఒక్క విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్ పెట్టుకుంది.
తను కమిటయిన సినిమాలో హీరోతో రొమాన్స్ చేసే సీన్స్ లో నటించడానికి ఒకే కానీ
సెక్స్ కామెడీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటానని అంటోంది. అంతేకాదు నేను
సెక్స్ కామెడీ సినిమాలు కూడా చేయను. ఇప్పటివరకు నేను చూసిన
సెక్స్ కామెడీ సినిమాల్లో
సెక్స్ తప్ప
కామెడీ లేదు. అర్థంపర్థం లేకుండా అనవసరంగా అమ్మాయిలపై అసభ్యకర కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులతో తీసే సినిమాలు చేయడం వేస్ట్ అని నా ఫీలింగ్. అదీకాకుండా ఇప్పటివరకు నేను పర్ఫామెన్స్కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాను. ప్రేక్షకులు కూడా నన్ను అలా చూడటానికే ఇష్టపడుతున్నారు.
నేను ఒక
సినిమా చేస్తున్నాంటే కచ్చితంగా అందులో ఏదో కంటెంట్ ఉందని ప్రేక్షకులు నమ్మాలి. ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాను. 'జుడ్వా 2'
సినిమా కోసం సన్నబడ్డాను. బికినీ వేసుకున్నాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ బికినీ ధరించే పాత్రలో కనిపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అంటోంది తాప్సీ. ఇక ప్రస్తుతం తాప్సి ప్రధాన పాత్రలో నటించిన 'సాండ్ కీ ఆంఖ్'
సినిమా ఇటీవల రిలీజై మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఈ సినిమాలో
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాధారంగా ఈ సినిమాను తుషార్ హీరానందని తెరకెక్కించారు.