మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో నేను శైలజతో హిట్ అందుకున్న కీర్తి సురేష్ మహానటి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. మహానటి తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తుంది. 


ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా.. తమిళంలో దర్బార్, పెంగ్విన్ సినిమాల్లో నటిస్తుంది కీర్తి సురేష్. ఇక రీసెంట్ గా తన పెళ్లి ప్రస్థావన తెచ్చిన మీడియా వాళ్లతో తనని లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయని చెప్పుకొచ్చింది. తన ఫ్యామిలీలో అందరు ప్రేమ పెళ్లి చేసుకున్నారని. తమ పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.తన సోదరి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందని తను కూడా అలానే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెబుతుంది కీర్తి సురేష్.


ప్రేమ మీద తనకు గౌరవం ఉందని అందుకే తనది ప్రేమ పెళ్లి కావొచ్చని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి ఇంత కచ్చితంగా చెబుతుంది అంటే తను ఎవరితోనే ప్రేమలో పడి ఉంటుందని కొందరు అంటున్నారు.  


తన నటనతో తెలుగు, తమిళ, మళయాళ ప్రేక్షకులను తన వల్లో వేసుకున్న కీర్తి సురేష్ మనసు గెలిచిన ఆ లక్కీ గాయ్ ఎవరో తెలియాల్సి ఉంది. తన మ్యారేజ్ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అది ప్రేమ పెళ్లి కావొచ్చు.. ఎరేంజెడ్ మ్యారేజ్ కావొచ్చని చెబుతుంది కీర్తి సురేష్. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ మరో ఐదారేళ్ల తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అప్పటికి సినిమాలు లేకుంటేనే పెళ్లి ఆలోచన చేస్తుందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: