పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళి  సినిమాల్లోకి వస్తున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నిజానికి గత ఏడాది హారిక హాసిని క్రియేషన్స్ వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాతో తన సినీ జీవితానికి పూర్తిగా స్వస్తి పలికిన పవన్, అనంతరం రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. అంతేకాక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరపున తన జనసేన పార్టీ తరపున పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ ఏ మాత్రం పట్టు వదలకుండా, ఇకపై తమ పార్టీ మరింతగా ప్రజలకు చేరువయ్యేలా ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. 

అయితే ఆయన నటించిన ఆఖరి సినిమా అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అవడంతో, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు. ఇక అప్పటినుండి కళ్యాణ్ గారు తమవంటి ఎందరో ఫ్యాన్స్ కోసం ఒక సినిమా చేయాలి అని మాత్రం పట్టుపడుతున్నారు. అయితే మొదట్లో ఆ విషయమై పెద్దగా ఆసక్తి చూపని పవన్, ఇటీవల పలువురు దర్శకులు తవద్దకు మంచి కథలు తీసుకువస్తుండడంతో ఫ్యాన్స్ కోసం ఒక సినిమా మాత్రం చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన వద్దకు వచ్చి కథలు వినిపించిన వారిలో దర్శకుడు క్రిష్ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చడంతో దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయగానే సినిమా మొదలెట్టేద్దాం అని మాట కూడా ఇచ్చినట్లు సమాచారం. 

ఏఎం రత్నం గారి శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సినిమా విషయమై పవన్ కొంత ఆలోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇటీవల క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు సినిమాలు ఘోరంగా ఫ్లాప్ కావడంతో, ఆయనకు ఛాన్స్ ఇవ్వాలా లేక వద్దా అని యోచిస్తున్నట్టు టాక్. అయితే పవన్ గారు పెద్దగా అటువంటి సెంటిమెంట్స్ నమ్మరని, కాబట్టి తప్పకుండా ఆయన సినిమాని తెరకెక్కించే ఛాన్స్ క్రిష్ కె దక్కుతుందని పవన్ సన్నిహితులు కొందరు అంటున్నారట. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: