ఈ మధ్య బాలీవుడ్ లో భారీ క్రేజ్ సాధించిన హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు. ముఖ్యంగా 'కబీర్ సింగ్' తర్వాత కియారాకు బాలీవుడ్ లో రెమ్యూనరేషన్ పరంగా చూస్తే  డిమాండ్ పెరిగింది. అటు బాలీవుడ్ సినిమాలే కాదు కియారా టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ సినిమా తర్వాత చరణ్-బోయపాటి కాంబినెషన్ లో వచ్చిన  'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. అయితే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కాగా రెండవది మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దాంతో కియారా బాలీవుడ్ లో హిట్ అందుకొని వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు కియారాకు టాలీవుడ్ నుండి మరో ఆఫర్ వచ్చిందట.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే కియారాను హీరోయిన్ గా తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయట. కానీ కియారా నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదట. కియారాకు టాలీవుడ్ సినిమాలో నటించేందుకు అభ్యంతరం లేదు. కానీ తన డైరీ ఖాళీ లేకపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయగలనా లేదా అని ఆలోచిస్తోందట. ఒకవేళ  డేట్స్ సర్దుబాటు చేయగలిగితే మాత్రం కియారా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రోమాన్స్ చేయడం పక్కా అని లేటెస్ట్ న్యూస్. అంతేకాదు మరోసారి మెగా హీరోతో సినిమా కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ బాగానే ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక కీలకపాత్రకు బాలీవుడ్ హీరోను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి కూడా చర్చలు సాగుతున్నాయని సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్.. మరో బాలీవుడ్ హీరోను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నరంటే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ని తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ట్రై చేస్తున్నారట. ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అయితే ఇక కియార అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అవడం ఖాయమని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: