బిగ్ బాస్ సీజన్ 3. మరో రెండు రోజుల్లో ఈ షో కి శుభం కార్డు పడనుంది. దీంతో కంటస్టెంట్ల మధ్య ఫోటి రసవత్తరంగా సాగుతుంది. అయితే శివ జ్యోతి ఎలిమినేట్ అయినా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో 5 మంది మిగిలారు. అందులో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఈ హౌస్ లో టాప్ 5 కాంటస్టెంట్స్ గా ఉన్నారు. 


అయితే ఈ టాప్ 5 కాంటస్టెంట్స్ ఎవరో ఒకరు గెలవాలని వారి ఫ్యాన్స్ వారికీ ఉదయానికి, రాత్రికి తేడా లేకుండా ఓట్లు వేస్తున్నారు. అందులో బాగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న వారు బాబా భాస్కర్ అయినప్పటికీ తమిళ్ అతను అవ్వడంతో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయింది. 


తర్వాత అలీ రెజాకి భార్య సహాయంతో గెలుస్తాడు అనుకున్నారు, కానీ గెలువడని అర్థం అయిపోయింది. అయితే ఇంకా మిగిలింది వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ముగ్గురిలో వరుణ్ వస్తాడు అనుకున్నారు. వరుణ్ కి కూడా ఫ్యాన్స్ బాగా ఉన్నారు కానీ రాహుల్ కి, శ్రీముఖికి ఉన్నంతమంది లేరు. 


దీంతో రాహుల్ సిప్లిగంజ్ గెలుస్తాడా ? శ్రీముఖి గెలుస్తుందా అని అందరూ ప్రశ్నలు వేసుకున్నారు. ఇద్దరి ఫ్యాన్స్ పోటాపోటీగా ఓట్లు వెయ్యడం మొదలు పెట్టారు. అయితే ప్రజల తీర్పు ప్రకారం రాహుల్ కి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కనిపించింది. కానీ రాహుల్ కంటే శ్రీముఖికి ఏ ఎక్కువ ఓట్లు వచ్చాయిని, 


శ్రీముఖినే గెలిచింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అయినట్టు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. అయితే అది బిగ్ బాస్ 3 విన్నర్ ట్రోఫీ నా లేకపోతే టాప్ 5 వారికీ వచ్చిన ట్రోఫీనా అనేది తెలియాల్సి ఉంది. అమ్మాయిలు అందరు కూడా రాహుల్ కి నోటీదుల ఎక్కువ అని.. అమ్మాయిలు అంటే మర్యాద లేదని .. శ్రీముఖి గెలవకపోయిన పర్వాలేదు కానీ రాహుల్ మాత్రం గెలవకూడదని సోషల్ మీడియాలో వార్తలు పోస్ట్ చేస్తున్నారు. మరి ఎవరు గెలిచారు అనేది తెలియాలంటే ఈ వారం చివరి వరుకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: